బతుకమ్మ, ఎల్లారెడ్డి : పట్టణంలోని ఎస్టీ రెసిడెన్షియల్ కళాశాలతోపాటు హాస్టల్ ను ఆర్డీవో ప్రభాకర్ తనిఖీ చేశారు. విద్యార్థులకు అందించే భోజనాన్ని పరిశీలించారు. సీజనల్ వ్యాధులు ప్రబలుతున్న నేపథ్యంలో తగిన జాగ్రత్త చర్యలు తీసుకోవాలని సిబ్బందికి సూచించారు. ఆయన వెంట తహసీల్దార్ మహేందర్ ఉన్నారు.