చెరువు శిఖంలో వెలసిన వెంచర్

3,730
  •  కార్పొరేటర్ లే ఇల్లీగల్ గా ఏర్పాటు చేసిన వెంచర్
  • అక్రమ నిర్మాణాలపై రెవెన్యూ శాఖ సీరియస్
  • పోలీస్ బందోబస్తు మధ్య రేకుల షెడ్ల కూల్చివేత

బతుకమ్మ ,నిజామాబాద్ : నిజామాబాద్ నగరంలోని 10,11 వ డివిజన్ ల పరిధిలోని బొందెం చెరువు, భారత రాణి నగర్ కాలనీలలో వెలసిన అక్రమ నిర్మాణాలపై అధికార యంత్రాంగం కొరడా జులిపించింది. శనివారం ఉదయం నిజామాబాద్ ఆర్డిఓ రాజేంద్ర కుమార్ తాసిల్దార్ బాలరాజు పోలీస్ అధికారుల సమక్షంలో జెసిబి లతో అక్రమంగా వెలిసిన నిర్మాణాలను, రేకుల షెడ్లను కూల్చివేశారు. గత ప్రభుత్వ సమయంలో ఆనాటి అధికార పార్టీ కార్పొరేటర్లు ఇల్లీగల్గా బొందెం చెరువు శిఖం భూమిలో వెంచర్ ఏర్పాటు చేశారు. వారికి నాటి మున్సిపల్ అధికారులు విద్యుత్ శాఖ అధికారులు రెవిన్యూ శాఖ అధికారులు అండగా నిలిచారు. చెరువు శిఖం భూమిలో ఏకంగా విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేసి సహకరించారు. మున్సిపల్ అధికారులు ఇంటి నంబర్లు సెల్ఫ్ అసెస్మెంట్ కింద కేటాయించడంతో అక్కడ అక్రమంగా రిజిస్ట్రేషన్లు కూడా జరిగాయి. ఆ ప్రాంతంలో తాజాగా నిర్మాణాలు జరుగుతుండడంతో స్థానికులు కొందరు ఫిర్యాదు చేశారు. ముఖ్యంగా ఒక కార్పొరేటర్, మరో కార్పొరేటర్ భర్త అందులో కీలక పాత్ర పోషించి శిఖం భూమిలో ప్లాట్లను విక్రయించి సొమ్ము చేసుకున్నారు. తాజాగా బిఆర్ఎస్ ప్రభుత్వం ఓటమి చెంది కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో అక్కడ నిర్మాణాలు చేసి ఇచ్చే ప్రయత్నాలు ముమ్మరంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలోని డాక్టర్ భారతీరాణి నగర్ కాలనీలో ఉమ్మడి రాష్ట్రంలో కేటాయించిన పట్టాలకు బదులు కొత్త పట్టాలను తయారుచేసి క్రయ విక్రయాలు జరిపిన ప్రాంతంలో వెలిసిన అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు. అదేవిధంగా బొందెం చెరువు శిఖం భూమిలో వెలిసిన వెంచర్ లో జరుగుతున్న నిర్మాణాలను కూడా కూల్చివేశారు. ఎవరు కూడా మున్సిపల్, రెవిన్యూ అధికారుల అనుమతులు లేకుండా ఎలాంటి నిర్మాణాలు చేపట్టిన కూల్చివేస్తామని అధికారులు హెచ్చరించారు.

illeagel-venture-in-cheruvu-sikham

Leave A Reply

Your email address will not be published.