- ప్లాట్ల కబ్జాకు సిద్ధమౌతున్న ల అడ్వాన్స్ ఇచ్చిన వారు
- గుడిసెలు వేసుకున్న వారికి ఫోన్ లో ఫైనాన్సియర్ ల బెదిరింపులు
- తమకు అధికార పార్టీ పెద్ధ లీడర్ల అండా ఉందని హెచ్చరికలు
- జే జే డేవలపర్స్ ప్లాట్ల కోసం ప్రత్యక్ష పోరాటానికి సిద్ధమౌతున్న కొనుగోలు దారులు
బతుకమ్మ, నిజామాబాద్ – నిజామాబాద్ నగర శివారులోని జేజే డెవలపర్స్ వెంచర్ లో గుడిసెలు వెలిశాయి. ఆదివారం కొందరు అక్కడ కొబ్బరి మట్టలతో గుడిసెలు వేసుకున్నారు. నగర శివారులోని మాదవ నగర్ వద్ధ బైపాస్ రోడ్డులో కోట్ల విలువ చేసే వెంచర్ లో పెదలు భూ ఆక్రమణలకు పాల్పడినట్లు గుడిసెలు వెసుకోవడం సర్వత్ర చర్చనీయాంశంగా మారింది. అది ఎమైనా ప్రభుత్వ భూమినా లేక చెరువు శిఖం భూములా అనే సందేహలు వ్యక్తం అయ్యాయి. బైపాస్ రోడ్డుకు సమీపంలో గజానికి 25 వేల పైచిలుకు పలుకుతున్న చోట ఉలుకు పలుకు లేకుండా వెంచర్ లో గుడిసేలు వేసుకోవడం తో అ రోడ్డు వేంట వెలుతున్న ఔరా అంటు ముక్కున వేలేసుకున్నారు. ఐతే అందులో గుడిసెలు వేసుకున్న వారు పెదవారు కాదు… ఆక్రమణ దారులు అంతకన్నకారు. వారు అసలు సిసలైన సంబందిత వెంచర్ లో ప్లాట్ల ను డబ్బులు ఇచ్చి కోనుగులుకు సిద్ధ పడిన వారు. ఓక్క రూపాయి రెండు రూపాయలు కాదు ఆక్షరాల లక్షలకు లక్షలు వెంచర్ చేసిన డేవలపర్స్ చేతిలో పోసి రిజిస్ర్టేషన్ చేయకుండా తాత్సరం చేస్తున్నంధుకు తగిన బుద్ధి చేప్పాలని ప్లాట్ల పై పోజిషన్ కోసం సిద్ధమౌతున్నారు…
నిజామాబామద్ నగర శివారులోని మాదవ నగర్ వద్ధ కోన్ని సంవత్సరాల క్రితం వరకు అక్కడ పచ్చని వ్యవసాయ భూములు ఉండగా జేజే డెవలపర్స్ అను పేరు మీదా కొందరు రియాల్టర్ లు అ భూమిని రైతుల వద్ధ కోనుగోలు ఓప్పంధం కుదుర్చుకున్నారు.వారికి కోంత సోమ్ము చెల్లించి దానిని అగ్రీమేంట్ చేసుకుని డెవలప్ మెంట్ చేశారు. అక్కడ ప్లాట్లు చేసి విక్రయించారు. ఐతే కరోనా కాలంకు ముందు జరిగిన ఒప్పంధం మేరకు ప్లాట్లు అమ్ముడు పోక, రైతులకు సకాలంలో డబ్బులు సర్ధుబాటు కోసం జేజే డేవలపర్స్ లోని ముఖ్యులు పైనాన్సియర్ లను అశ్రయించారు. కాని అందుకు ముందుగా రైతుల వద్ధ డెవలపర్స్ కోనుగోలు కాకుండా నేరుగా పైనాన్సీయర్ లు కోనుగోలు చేసినట్లు అగ్రీమెంట్ లు రాసుకున్నారు.ప్లాట్లు కోనుగోలుకు లబ్ధిదారులు జేజే డెవలపర్స్ కు ముందుగానే డబ్బులు చెల్లించి ఉండడంతో నేరుగా రిజిస్ర్టేషన్ కు యత్నించగా ఈ విషయం మార్చి మొదటి వారంలో బహిర్గతమైంది. ఈ విషయంలో అందోళన చెందిన ప్లాట్లు కోనుగోలు చేసిన 60 మంది డేవలపర్స్ ను నిలదిశారు. కాని అప్పటికే పైనాన్సియర్ లు అక్కడ జేజే డేవలపర్స్ పేరు మీద ఉన్న బోర్డును తీసివేసి తమ వేంచర్ అంటు కోత్త బోర్డు ఎర్పాటు చేశారు. ప్రైవేట్ సైన్యం ఎర్పాటు చేసి వెంచర్ చూట్టురా పెన్సింగ్ వేశారు. అక్కడ ప్లాట్ల కోసం అడ్వాన్స్ డబ్బులు ఇచ్చిన వారు ఈ విషయంలో డేవలపర్స్ పై డిచ్ పల్లి పోలిస్ స్టేషన్ లో పిర్యాదు చేయడంతో పోలిస్ లు కేసు నమోదు చేశారు. డేవలపర్స్ కుడా తమను పైనాన్సియర్ లు వడ్డిలకు వడ్డిలు కట్టించుకుని తాము డేవలప్ చేసిన వేంచర్ లోకి రానివ్వడం లేదని పిర్యాదు చేశారు. దానితో ఈ సమస్య పోలిస్ స్టేషన్ ల చూట్టురా చక్కర్లు కోట్టింది. ఈ విషయంలో అధికార పార్టికి చేందిన ముఖ్యుడు జోక్యం చేసుకోగా ప్లాట్లు కోనుగోలు కు ముందస్ధు డబ్బులు చెల్లించిన వారు న్యా య పోరాటంకు సిద్ధమయ్యారు.
ఐతే అక్కడ పైనాన్సియర్ ల కంటే ముందుగా డేవలపర్స్ అడ్వాన్స్ ఇచ్చినట్లు వారి పేరు మీదానే నుడా పరిధిలో నాలా కన్వర్షన్ లతో పాటు లే అవుట్ పర్మిషన్ వచ్చి ఉండటంతో రైతులు, పైనాన్సియర్ లు ఎకమైన ప్లాట్ల కోనుగోలుకు డబ్బులు ఇచ్చిన వారిని మోసం చేయాలన్న పన్నాగం పారలేదు. అదే సమయంలో డేవలపర్స్ ను నయానో భయానో ఒప్పించుటకు సకల విదాలుగా ప్రయత్నించారు. ఇక ప్లాట్ల కోనుగోలు దారులు ఐక్యంగా అందోళన చేస్తుండటంతో అప్పులు ఇచ్చిన వడ్డి వ్యాపారులు విభజించు పాలించు సూత్రం అమలు చేసేందుకు యత్నించారు. తమకు ప్రస్తుత మార్కేట్ రేట్ డబ్బులు ఇస్తే ప్లాట్లు రిజిస్ర్టేషన్ చేసి ఇస్తామని సంది రాయబారాలు సాగించారు. కాని ఓకటి కాదు రెండు కాదు లక్షలకు లక్షలు అడ్వాన్స్ ల రూపంలో ఇచ్చి మళ్లి పైనాన్సియర్ లకు ఎందుకు డబ్బులు ఇస్తామని తెగెసి చెప్పారు. దానితో ఈ వ్యవహరం అక్కడే అగిపోయింది. పోలిస్ కేసులు, కోర్టు కేసుల నేపథ్యంలో గత ఐదు నెలలుగా ఈ వ్యవహరం సైలేంట్ గా ఉంది. న్యాయ పోరాటంతో పాటు తమ ప్లాట్లను తమకే దక్కలని అక్కడ ప్లాట్ల కోసం అడ్వాన్స్ లు ఇచ్చిన వారు అందోళనకు సిద్ధమౌతున్నారు.అందులో బాగంగా పోజీషన్ కోసం అక్కడ తమకు ఎక్కడ ప్లాట్లు అని చూపించారో అక్కడ పాకలు వేయడం ప్రారంభించారు. ఈ నేపథ్యంలో అదివారం అక్కడ ప్లాట్లు కోనుగోలుకు డేవలపర్స్ కు డబ్బులు ఇచ్చిన వారు పైనాన్సియర్ ల మద్య పోన్ లలో మాటాల యుద్ధం సాగింది. రెండు ముడు రోజులలో తమ ప్లాట్లను దక్కించుకునేందుకు ప్రత్యక్ష అందోళనకు సిద్ధమౌతున్నారు. రాష్ర్టంలో ప్రభుత్వం హైడ్రాను ప్రయోగిస్తుండగా, జిల్లాలో అదిక వడ్డి వసూలు చేస్తున్న జీరో పైనాన్స్ వ్యాపారులపై పోలిస్ కమీషనర్ కోరడా ఝూలిపిస్తుండటంతో ఈ అవకాశాలను సద్వినియోగం చేసుకునేందుకు సిద్ధమై పోరుబాట పట్టనున్నారు.