మాదిగలపై దాడులు చేస్తే సహించం

970

బతుకమ్మ నిజామాబాద్ అర్బన్ : నందిపేట్ మండలం తల్వేద గ్రామంలో మాదిగ కులానికి చెందిన తన బంధువు కు చెందిన భూమిలో నుండి ఎలాంటి అనుమతులు లేకుండా రోడ్డు వేసుకొని, వ్యవసాయ బావిలో రాళ్ళతో మూసేసి, అదే గ్రామానికి చెందిన ఆవుల్దాపురం సాయి రెడ్డి అనే వ్యక్తి దాడి చేయడం జరిగిందని ఎమ్మార్పీఎస్ నాయకులు సుధాకర్ ఆరోపించారు. సోమవారం జిల్లా కలెక్టరేట్లో జరిగిన ప్రజావాణిలో తమ బంధువులపై జరిగిన అన్యాయాన్ని జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ ఘటనపై ఎమ్మార్పీఎస్ తీవ్రంగా ఖండిస్తున్నట్లు ఆయన అన్నారు. వెంటనే వెంటనే దౌర్జన్యానికి పాల్పడ్డ వ్యక్తిని పోలీసులు అరెస్టు చేసి కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా రెండు బోర్లను ప్రభుత్వ ఖర్చులతో వేయించి, తమపై దాడికి దిగి వ్యక్తిగతంగా శారీరకంగా దారులకు పాల్పడ్డావా సదరు వ్యక్తిపై ఆసుపత్రి బిల్లులు 9.00లక్షలు చెల్లించేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. జీవో నెంబర్:29 ప్రకారం చెల్లించి ఆర్థికంగా ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్, పోలీస్ కమీషనర్ ని కలవడం జరిగిందన్నారు. కార్యక్రమంలో, జిల్లా అధ్యక్షుడు గుండారం మోహన్, నగర అధ్యక్షురాలు సమాధాన తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.