బతుకమ్మ, మోర్తాడ్: ఆగస్టు12 : మరణించిన సమగ్ర శిక్ష ఉద్యోగులకు సోమవారం మోర్తాడ్ మండల కేంద్రంలో కమిటీ ఆధ్వర్యంలో నివాళులు అర్పించడం జరిగింది. నివాళులు అర్పిస్తూ ఉద్యోగ భద్రత కల్పించాలని, మినిమం టైం స్కేల్ అమలు చేయాలని, వెంటనే మరణించిన ఉద్యోగులకు ఎక్స్ గ్రేషియ ప్రకటించాలని డిమాండ్ చేయడం జరిగింది. ప్రభుత్వం మా యొక్క సమస్యలను పరిష్కరించని యెడల దశల వారీగా నిరసనలు తెలియ చేస్తూ సమ్మెకు పిలుపు ఇస్తాం అన్నారు. ఈ కార్యక్రమంలో మోర్తాడ్, ఎర్గట్ల మండల కమిటీ సభ్యులు నవీన్ ,సాయిరాం, శ్రావణ్ ,పరిమళ,ప్రేమ స్వరూప, వినీత, సురేష్ ,రాము,మధు శేఖర్ ,గంగా ప్రసాద్. పండరి, మహేందర్ ,సునీల్ పాల్గొన్నారు.
