విద్యుత్ షాక్ తో రైతు మృతి

3,468

బతుకమ్మ, నిజాంసాగర్: బోరుబావి వద్ద స్టార్టర్ బాక్స్ వద్ద విద్యుత్ వైర్లు సరి చేస్తుండగా షాక్ తగిలి మండలంలోని వెల్గనూర్ గ్రామానికి చెందిన రైతు మేదరి సాయిరాం(42) సోమవారం సాయంత్రం మృతి చెందాడు. పొలానికి నీళ్లు పెట్టేందుకు ఇంటి నుంచి వెళ్లిన సాయిరాం చీకటి పడినా తిరిగిరాలేదు. కుటుంబ సభ్యులు పొలానికి వెళ్లి చూడగా సాయిరాం చనిపోయి కనిపించాడు. మృతునికి భార్య  సుశీల, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య  ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం ఎల్లారెడ్డి ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఎస్సై కే.సుధాకర్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.