బతుకమ్మ, భీంగల్ : ఎస్సీ వర్గాల్లో విబేధాలు సృష్టించేందుకు ఎస్సీ వర్గీకరణ తీసుకురావడాన్ని నిరసిస్తూ ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి పిలుపు ఇచ్చిన బంద్ భీంగల్ పట్టణం లో సక్సెస్ అయ్యింది. మాల సంక్షేమ ఐక్య వేదిక ఆధ్వర్యంలో పట్టణంలో నిర్వహించిన బంద్ కారణంగా దుకాణలు,విద్యా సంస్థలు పెట్రోల్ బ్యాంకులు, హోటల్స్ అన్ని బంద్ చేశారు.ఈ సందర్బంగా ఎస్సీ వర్గీకరణ పోరాట సమితి సభ్యులు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ చట్టం తేవడం కుట్రపూరితమని, ఇది ఎస్సీ, ఎస్టిల్లో విభేదాలను సృష్టిస్తుందని స్పష్టం చేశారు. డా. అంబేత్కర్ ఇచ్చిన హక్కులను కాపాడుకొనేందుకు తాము ముందుంటామని అన్నారు. షెడ్యూల్ కులాలలకు అస్పరుష్యత, అంటరానితనం కారణంగానే ఈ రిజర్వేషన్లు వచ్చాయని, మోడీ గవర్నమెంట్ రాజ్యాంగాన్ని మార్చేందుకు యత్నిస్తుందని అన్నారు. బీజేపీ కీ తగిన గుణపాఠం చెప్పేందుకు ఇదే అసలైన సమయమని అన్నారు. దేశ ఉన్నత న్యాయస్థానం తీర్పు విద్యార్థుల భవిష్యత్ పై తీవ్ర ప్రభావం చూపుతుందన్నారు. తెలంగాణ లో ఎస్సీ వర్గీకరణ ఆర్డినేన్స్ తెచ్చి అమలు చేస్తామని సీ. ఎం రేవంత్ రెడ్డి వ్యాఖ్యానించడాన్ని వారు తీవ్రంగా ఖండించారు.ఈ కార్యక్రమం లో మాల సంక్షేమ సంఘం నాయకులు సోమిడి దేవిదాస్, పర్స రత్నం, పర్స అనంత్ రావు, కునే రమేష్, మేకల శ్రీనివాస్, బట్టు అనిల్,నందు,దైడి సురేష్, భీమా రవీందర్ తదితరులు పాల్గొన్నారు.