బతుకమ్మ, మద్నూర్: గత వారం ప్రియురాలిని హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసిన మమత మృతికి సెవెన్ హిల్స్ హాస్పిటల్ సిబ్బంది సోమవారం సంతాపం వ్యక్తం చేశారు. బీర్కూర్ మండలంలోని బరంగ్ఎడ్గి గ్రామానికి చెందిన మమత బాన్సువాడ డివిజన్ కేంద్రంలోని సెవెన్ హిల్స్ ప్రైవేట్ హాస్పిటల్లో నర్సుగా పనిచేస్తుంది. మమత మరణం పై హాస్పిటల్ యజమాన్యం, సిబ్బంది ఆమెకు ఘనంగా నివాళులు అర్పించి సంతాపం వ్యక్తం చేశారు. ప్రవీణ్ రెడ్డి, గంగారెడ్డి, డాక్టర్ వాగ్దేవి స్వామినేని, డాక్టర్ రఘు తేజ, డాక్టర్ రోహిణి, డాక్టర్ అవినాష్, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు