బతుకమ్మ, నిజామాబాద్ : నగరపాలక సంస్థ ఉద్యోగుల మీద వివిధ ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో నిజామాబాద్ మున్సిపల్ కమిషనర్ మంద మకరంద్ ఉద్యోగులు, సిబ్బంచే – సమగ్రత ప్రతిజ్ఞ చేయించారు. ఇటీవల నిజామాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ లోని సూపరింటెండెంట్, ఇంచార్జి ర వెన్యూ ఆఫీసర్ దాసరి నరేందర్ ఆదాయానికి మించి ఆస్తులున్నాయని ఏసీబీ అధికారులు అరెస్టు చేసిన విషయం తెలసిందే. దీంతో కమిషనర్ బుధవారం మున్సిపల్ కార్యాలయంలో అన్ని విభాగాల ఉద్యోగులు, సిబ్బందితో సమావేశం నిర్వహించి,సిబ్బంది పాటించాల్సిన నియమావళి గురించి తెలియజేసి అతిక్రమిస్తే చర్యలు ఉంటాయని హెచ్చరించారు. విధులలో ఎలాంటి పొరపాట్లు,అవినీతి చేయబోమని సిబ్బందిచే సమగ్రత ప్రతిజ్ఞ చేయించారు.
