బతుకమ్మ భిక్కనూరు : భిక్కనూరుమండలంలోని వరదలకు నీటి మునిగిన రామేశ్వర్ పల్లి డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను సోమవారం జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ పరిశీలించారు. స్థానిక డబుల్ బెడ్ రూమ్ ఇళ్లలోకి నీరు చేరడంతో గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో ఆ్ ్రశయం పొందుతున్న బాధితులను కలెక్టర్ వారి వద్దకు వెళ్లి వారి బాధలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ డబుల్ బెడ్ రూమ్ ఇళ్ల సమస్యను పరిష్కరిస్తాని గ్రామస్తులకు హామీ ఇచ్చారు.