. . . తిరుమల శ్రీవారిని కోరుకున్నఎమ్మెల్యే ధన్ పాల్
బతుకమ్మ, నిజామాబాద్ సిటీ
తెలంగాణ రైతన్నలకు ఇచ్చిన 2 లక్షల రుణమాఫీ పూర్తి చేస్తానన్నా హామీ నేరవెర్చేల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కి బుద్ది ప్రసాదించాని తిరుమల ఏడుకొండల స్వామిని అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ వేడుకున్నట్లు తెలిపారు. శుక్రవారం ఆయన తన కుటుంబ సమేతంగా తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలుగు ప్రజలందరు సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని రైతన్నలకు సకాలంలో వర్షాలు కురిసి పాడి పంటలు అధికంగా పండాలని దేవున్ని కోరినట్లు ఎమ్మెల్యే ధన్ పాల్ సూర్యనారాయణ తెలిపారు.