
బతుకమ్మ, బోధన్ : మహారా ష్ట్ర ప్రాంతం నుంచి గోదావరిలోకి భారీగా వరద వస్తుండడంతో బోధన్ మండలం బిక్నెల్లి, హంగర్గా గ్రామాల పరిధిలోని సుమారు వెయ్యి ఎకరాల విస్తీర్ణంలో సోయా నీటమునిగింది. సోమవారంతో పోలిస్తే ఈ రోజు వరద ప్రవాహం పెరిగిందని తాము ఏమీ చేయలేక నిస్సహాయ స్థితిలో ఉన్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.