రుద్రూర్, బతుకమ్మ : రుద్రూర్ మండల కేంద్రంలో గురువారం 78 వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని గ్రామ పంచాయతీ కార్యాలయం, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం, సమికృత మండల సముదాయం, పోలీస్ స్టేషన్, అన్నీ ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలు, గ్రంథాలయం, చేనేత సహకార సంఘం వద్ద జాతీయ పతాకాన్ని ఎగురవేసి ఘనంగా స్వాతంత్ర దినోత్సవ వేడుకలను జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ వెంకటేష్, ఎంపిడివో సురేష్ బాబు, ఐకేపి స్పెషల్ ఆఫీసర్ నిర్మల, సొసైటీ చైర్మన్ సంజీవ్ రెడ్డి, మాజీ సొసైటీ చైర్మన్ పత్తి రాము, మాజీ సర్పంచ్ ఇందూరి చంద్రశేఖర్, పత్తి లక్ష్మణ్, వివిధ శాఖల అధికారులు, స్థానిక మండల ప్రజాప్రతినిధులు,విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.