కవితకు ఘన స్వాగతం

3,672
  • ఎయిర్ పోర్టులో ఘన స్వాగతం
  • ఇంటివద్ద కార్యకర్తల సందడి

బతుకమ్మ, హైదరాబాద్ – ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో జైలు నుంచి విడుదలైన ఎమ్మెల్సీ కవితకు హైదరాబాద్ లో ఘన స్వాగతం లభించింది. బుధవారం మధ్యాహ్నం ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఎయిర్ పోర్టు నుంచి ఫ్లయిట్ లో హైదరాబాద్ కు వచ్చిన కవితకు బీఆర్ ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున స్వాగతం పలికారు. మార్చి 15న ఈడి అధికారులు అరెస్టు చేసి ఢిల్లీకి తరలించగా ఐదున్నర నెలల తర్వాత హైదరాబాద్ కు వచ్చిన కవితకు స్వాగతం పలుకుతూ హైదరాబాద్ నలుమూలల ఫ్లెక్సీలను ఏర్పాటు చేయడంతో పాటు ఎయిర్ పోర్టులో పూలవర్షం కురిపించారు. ఎయిర్ పోర్టులో బీఆర్ఎస్, జాగృతి నాయకులు, కార్యకర్తల సందడి చేశారు.

Welcome to Kavitha జై కవితక్క, జై తెలంగాణ నినాదాలతో ఎయిర్ పోర్టు మార్మోగింది. జూబ్లీహిల్స్ లోని తన నివాసానికి చేరుకున్న కవితకు అక్కడ కూడా జననీరాజనం పలికారు. జైలు నుంచి విడుదలై ఇంటికి చేరిన కవితకు ఆమె తల్లి,కేసీఆర్ సతీమణి శోభ ఆలింగనం చేసుకున్నారు. ఈ సందర్భంగా కేటీఆర్ కు కవిత రాఖీ కట్టారు. మీడియాతో మాట్లాడుతూ నిజం గెలిచిందని, ఎప్పటికైనా న్యాయమే గెలుస్తుందని స్పష్టం చేశారు. ఈ కష్టసమయంలో కేసీఆర్ కు, తనకు, తన కుటుంబానికి అండగా ఉన్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఎటువంటి తప్పు చేయని తాను కడిగిన ముత్యంలా బయటికి వస్తాను అన్న విశ్వాసం మొదటి నుంచి తనకు ఉందని తెలిపారు. ప్రజల సమస్యలపై ప్రజా క్షేత్రంలో తను కొట్లాడుతూనే ఉంటానని అన్నారు. “నేను ఏ తప్పూ చేయలేదు. ఎప్పటికైనా న్యాయం గెలిచి తీరుతుంది. నేను ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి ఏదో ఒక రోజు నిజమేంటనేది తెలుస్తుంది. ఆ రోజు వరకు నా పోరాటం ఆగదు. కేసీఆర్ నాయకత్వంలో పోరాడతా. ప్రజా క్షేత్రంలో ఇంకా బలంగా పనిచేస్తా. ఇక నుంచి బీఆర్ఎస్ కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటా. ఈ కేసు నుంచి కడిగిన ముత్యంలా బయటపడతా అనే నమ్మకం, విశ్వాసం రెండూ నాకు ఉన్నాయి.” అని ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు. తాను తెలంగాణకు, తన ఇంటికి రావడం సంతోషంగా ఉందని అన్నారు. తనపై జరిగిన రాజకీయ కుట్రపై న్యాయపోరాటం చేస్తానన్నారు. కవిత గురువారం ఎర్రవల్లిలోని ఫాంహౌజ్ లో తండ్రి కేసీఆర్ తో భేటీ కానున్నట్లు సమాచారం. నిజామాబాద్ కు చెందిన మాజీ ఎమ్మెల్యేలు బాజిరెడ్డి గోవర్ధన్, గణేష్ గుప్తలు హైదరాబాద్ లో కవితతో భేటీ అయి వారితో పాటే హైదరాబాద్ కు చేరుకున్నారు. హైదరాబాద్ లో ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు బీఆర్ఎస్ నాయకులు గడ్డం సుమనారెడ్డి, విశాలినిరెడ్డి, సిర్ప సువర్ణ, దాత్రిక రేవతితో పాటు మహిళ నేతలు స్వాగతం పలికారు.

Welcome to Kavitha

Leave A Reply

Your email address will not be published.