అర్హులందరికీ రుణమాఫీ

445
  • ప్రతి హామీని నెరవేర్చే బాధ్యత కాంగ్రెస్ ది
  • బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి

బతుకమ్మ నిజామాబాద్ సిటీ: చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలోని అర్హులైన ప్రతి రైతుకూ రుణమాఫీ ని అందిస్తుందని మాజీ మంత్రి, బోధన్  ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డి అన్నారు. జిల్లా కేంద్రంలోని పార్టీ కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. పదేళ్లు రాష్ర్టాన్ని పాలించిన కేసీఆర్ రైతులకు న్యాయం చేయకపోగా వారికి సకాలంలో రైతుబంధు, రుణమాఫీ ఇవ్వక ఇబ్బందులకు గురి చేసిందని విమర్శించారు. కాంగ్రెస్ ను విమర్శించే హక్కు టీఆర్ఎస్ నాయకులకు లేదన్నారు. రుణమాఫీ ప్రక్రియలో భాగంగా బ్యాంకుల్లో సాంకేతిక సమస్యలు రాకుండా జిల్లా కలెక్టర్ తో చర్చించి ప్రతి మండలానికి ఒక నోడల్ అధికారిని నియమించినట్లు తెలిపారు. సీఎం రేవంత్ రెడ్డి ఎన్నికలకు ముందు ఇచ్చిన ప్రతి హామీని నెరవేర్చే బాధ్యత కాంగ్రెస్ పై  ఉందన్నారు. డీసీసీ అధ్యక్షుడు, రాష్ట్ర కో ఆపరేటీవ్ సొసైటీ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి, ఉర్దూ అకాడమీ చైర్మన్ తాహెర్ బిన్ హందాన్, కిసాన్ కేత్ జిల్లా అధ్యక్షుడు ముప్పగంగారెడ్డి,  రాష్ట్ర నాయకులు గడుగు గంగాధర్, మైనార్టీ నాయకుడు జావిద్ అక్రం తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.