గంజాయి తరలిస్తున్న పాత నేరస్తుడి పట్టివేత

474

బతుకమ్మ, నిజామాబాద్ క్రైం : గంజాయి తరలిస్తున్న పాత నేరస్తుడిని ఎక్సైజ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారులు మంగళవారం రాత్రి అరెస్ట్ చేశారు. నగరంలోని ఖిల్లా చౌరస్తాలో ఇన్ స్పెక్టర్ వెంకటేశ్ ఆధ్వర్యంలో తనిఖీలు చేపట్టగా, పాత నేరస్తుడైన షేక్ అస్లాం పట్టుబడ్డాడు. అతడి వద్ద నుంచి 260 గ్రాముల గంజాయితోపాటు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. షేక్ అస్లాం పై గతంలో మూడు గంజాయి కేసులు ఉన్నాయని, అతడిని అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించామని సీఐ వెంకటేశ్ తెలిపారు.

Leave A Reply

Your email address will not be published.