- కంపుకొడుతున్న టాయిలెట్స్ పై చైర్మన్ ఆగ్రహం
- పాఠశాలలో రిజిస్టర్స్, ఇతర తనిఖీలకు అడ్డు పడ్డ నిర్వాహకులు
బతుకమ్మ, కామారెడ్డి : కామారెడ్డి జిల్లా కేంద్రంలోని దేవుని పల్లి రోడ్డులో గల జీవదాన్ హైస్కూల్ ను మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియా చంద్రశేఖర్ రెడ్డి, కమిషనర్ సుజాత, సిబ్బంది తో కలిసి ఆకస్మికంగా తనిఖీల నిమిత్తం వెళ్లారు. శుక్రవారం జీవదాన్ పాఠశాలకు అధికారులతో కలిసి ఆకస్మికంగా తనిఖీలకు వెళ్లిన సమయంలో పలు విషయాలు బహిర్గతం కావడంతో మునిసిపల్ చైర్మన్ గడ్డం ఇండప్రియ, కమిషనర్ లు యాజమాన్యం తిరుపై అగ్రహం వ్యక్తం చేశారు. జీవదాన్ పాఠశాలలో ఉపాధ్యాయుల,, సిబ్బందికి సంబందించిన బాత్ రూమ్స్, టాయిలెట్స్ సక్రమంగా ఉండగా విద్యార్థులకు సంబందించిన టాయిలెట్స్ మురికి కూపంగా, దుర్గంగద భరీతంగా ఉండటంపై మున్సిపల్ చైర్మన్ యాజమాన్యంపై అగ్రహం వ్యక్తం చేశారు. టాయిలెట్స్ ఇలాగే ఉంచుతారా అంటూ అసహనం వ్యక్తం చేసి వెంటనే బాత్ రూమ్స్, టాయిలెట్స్ క్లినింగ్ చేయించాలని ప్రిన్సిపాల్ ను ఆదేశించారు.
పాఠశాలలో విద్యార్థులకనుగుణంగా టాయిలెట్స్ లేకపోవడంపై ప్రశ్నించారు. విద్యార్థినిలకు సౌకర్యాలు లేకపోవడం తీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఫీజులు వసూళ్ల మీద ఉన్న శ్రద్ద పాఠశాలలో మౌలిక వసతుల కల్పనపై ద్రుష్టి పెట్టాలని మున్సిపల్ చైర్మన్ ఆదేశాలు జారీ చేశారు. పాఠశాలకూ రికార్డ్స్, రిజిస్టర్, విద్యార్థుల సంఖ్యలకు సంబందించిన రికార్డ్స్ చూయించాలని ప్రిన్సిపాల్ ను కోరగ చూయించకపొగ నిర్లక్ష్య సమాధానాలు చెప్పడం పై ఈ విషయమై విద్యాశాఖ అధికారులకు మున్సిపల్ చైర్మన్ ఫోన్ లో ఫిర్యాదు చేశారు. పాఠశాలలో జరుగుతున్న అక్రమాలు, మౌలిక వసతుల సమస్యలపై విద్యాశాఖ చర్యలు తీసుకోవాలని, నిర్లక్ష్యపు సమాధానాలు చెప్తున్న యాజమాన్యంపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఉన్నతాధికారులకు ఫోన్ లో మున్సిపల్ చైర్మన్ గడ్డం ఇందుప్రియా ఫిర్యాదు చేశారు. విద్యార్థుల తల్లీ దండ్రులు సైతం పాఠశాలలో వసతులపై తెల్సుకోవాలని సూచించారు. చైర్మన్ వెంట కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు.
