. . . అనన్య కుటుంబ సభ్యులకు అర్థిక సహయం అందచేసిన మాజీ ఎమ్మెల్యే
బతుకమ్మ, నిజామాబాద్:
గత రెండు రోజుల క్రితం నిజామాబాద్ నగరంలో గల ఆనంద్ నగర్ ప్రాంతంలో కాలువలో పడి అనన్య మృతి చెందిన అనన్య కుటుంబానికి బిఆర్ఎస్ పార్టి అండగా ఉంటుందని నిజామాబాద్ అర్బన్ మాజీ శాసన సభ్యులు గణేష్ బిగాల తెలిపారు. నిజామాబాద్ అర్బన్ మాజీ శాసన సభ్యులు ఆదేశానుసారం నగర సీనియర్ నాయకుల బృందం శుక్రవారం బాధిత చిన్నారి అనన్య దతల్లిధండ్రులు పూజ,తండ్రి మారుతీ ఇంటికి వెళ్లి వారిని పరామర్శించారు. అదేవిధంగా భవిష్యత్ లో మున్సిపల్ కార్పొరేషన్ ద్వారా బాధితులకు ఎదురయ్యే సమస్యలకు అన్ని విధాలుగా పార్టీ అండగా ఉంటుందని , ప్రభుత్వం ద్వారా కూడా ఆర్థిక సాయం అందే విధంగా అన్ని విధాల కృషి చేస్తామని గణేష్ బిగాల మాటగా వారికి ధైర్యం చెప్పి రూ.10,000 ఆర్థిక సాయాన్నిఅందచేశారు.ఈ కార్యక్రమంలో…. మాజీ నుడా చైర్మెన్ ప్రభాకర్ రెడ్డి, నగర అధ్యక్షులు సిర్ప రాజు, సీనియర్ నాయకులు సుజిత్ సింగ్ ఠాకూర్, సూదాం రవి చందర్, సత్యప్రకాష్, ఎనగందుల మురళి, జగత్ రెడ్డి, స్థానిక కార్పోరేటర్ విక్రం గౌడ్ తదితరులు పాల్గొన్నారు.