పిట్లం, బతుకమ్మ: మండల కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో సోమవారం ఆర్టీసీ బస్సు – బైక్ ఢీకొని యువకుడికి తీవ్రగాయాలయ్యాయి. మండల కేంద్రానికి చెందిన ప్రశాంత్ బస్టాండ్ వైపు నుంచి బైక్ పై వెళ్తుండగా, బాన్సువాడ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ఘటనలో ప్రశాంత్ కు తీవ్ర గాయాలు కాగా అతడిని చికిత్స నిమిత్తం కుటుంబ సభ్యులు హైదరాబాద్ తరలించారు.