ఫాం పాంట్స్, ఫిష్ పాండ్ పై అవగాహన కరువు

1,263

బతుకమ్మ, మోర్తాడ్:  భూగర్భ జల రక్షణ కోసం ప్రభుత్వం చేపట్టిన పంట భూములు నీటి నిల్వ గుంతలు నిర్మాణం పై రైతులకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారని విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. ఉన్న నీటిని పొదుపుగా వాడుకోవడం వర్షాకాలంలో వృధాగా పోయే నీటిని వినియోగించుకోవాలని సదుద్దేశంతో తలపెట్టిన ఫాం పాంట్స్ నిర్మాణాన్ని ఇప్పటి వరకు ఏ ఒక్క రైతు ఉపయోగించుకోలేదు. ఫాం ఫాంట్స్ నిర్మాణంతో కలిగే ఉపయోగాలపై ఉపాధి హామీ సిబ్బంది అవగాహన కల్పించిన సందర్భాలు లేవని పలువురు రైతులు పేర్కొంటున్నారు. ఉపాధి హామీ పథకం ద్వారా జిల్లాలోని వ్యవసాయ భూముల్లో ఫాం పాంట్స్ నిర్మాణం చేపట్టేందుకు రైతులు ముందుకు రావడం లేదు. గ్రామాల్లో ఫామ్ పాంట్స్ నిర్మాణం గురించి వాటి వల్ల కలిగే లాభాల గురించి నిర్మాణం చేపడితే భూగర్భ జలాలు పెరుగుతాయని ఎ టువంటి నీటి కొరత వ్యవసాయ క్షేత్రాలలో ఉండదని అవగాహన కల్పించిన దాఖలాలు గ్రామాల్లో కనిపించడం లేదని రైతుల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
వ్యక్తిగతంగా ఏర్పాటు చేసుకోవాలి..
గతంలో కమ్యూనిటీ ఫిష్ పాండే నిర్మాణాలు చేపట్టాలని అధికారులు తెలిపారు. కానీ ప్రస్తుతం చిన్న, సన్న కారు రైతులకు ఉపయోగకరంగా ఉండేలా ఫిష్ పాండ్ నిర్మాణాలను వ్యక్తిగతంగా ఏర్పాటు చేసేందుకు ఈ పథకాన్ని అమలు చేయాలని అభిప్రాయం వ్యక్తం అవుతోంది. చేపలు పెంచి ఉపాధి పొందవచ్చని నీటి నిల్వకు అనుకూలంగా ఉండి భూగర్భ జలాలు సమృద్ధిగా పెరిగేందుకు దోహదపడుతుందని అంటున్నారు. అలాగే కూలీలకు తగినంత పని కల్పించవచ్చు. ప్రభుత్వం వ్యక్తిగతంగా ఫిష్ పాండ్ నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకొంటున్నారు.
తక్కువ కూలీలతో..
మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా ఈ సంవత్సరం పని దినాలు ముగియడంతో కూలీలు పనులు లేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఉపాధి హామీ పథకంలో భాగంగా కేవలం ఫాం పాంట్స్, ఫిష్ పాంట్స్ నిర్మాణం పనులు మాత్రమే చేయాలని అధికారులు ఆదేశించినట్లు సమాచారం. వీలైనంత తక్కువ మంది కూలీలతో ఈ పనులు చేయాలని అధికారుల నుంచి ఆదేశాలు వచ్చినట్లు విశ్వాసనీయ సమాచారం. తక్కువ మంది కూలీలతో పనులు చేయించాలంటే క్షేత్ర సహాయకులు వారికి అనుకూలంగా ఉన్న వ్యక్తులనే పనులకు పిలిచి పని కల్పిస్తారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అలా కాకుండా అందరికీ పనులు చూపించాలని ఉపాధి కూలీలు పేర్కొన్నారు.
జిల్లాలో కూలీలు..
నిజామాబాద్ జిల్లా లో గ్రామపంచయితీలు 530 ఉండగా, ఉపాధి జాబ్ కార్డుస్ ఉన్నవారు 2,55,236 మంది ఉన్నారు. ఇందులో 4,83,762 మంది నమోదైన కూలీలుగా ఉన్నారు. నిత్యం పనిచేస్తున్నది సుమర్ 7000 మంది కూలీలుగా లెక్కలు చెబుతున్నాయి. కావున కొంతమంది కూలీలకే పని కల్పిస్తే మిగిలిన వారు ఆర్థిక ఇబ్బందులు పడవలసి వస్తుందని ఉపాధి కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ఇప్పటికైనా అధికారులు స్పందించి అందరు కూలీలకు పని కల్పించడం కోసం సహకరించాలని కోరుచున్నారు.
గ్రామాల్లో అవగాహన కల్పిస్తాం..
సాయ గౌడ్ (గ్రామీణ అభివృద్ధి అధికారి) నిజామాబాద్.
గతంలో ఉపాధి హామీ పథకం ద్వారా కమ్యూనిటీ ఫిష్ పాండ్ నిర్మాణాలు చేపట్టారు. కానీ ఇప్పుడు ఫాం పాంట్స్, ఫిష్ పాండ్ నిర్మాణాలు వ్యక్తి గతంగా ఏర్పాటు చేసుకోవచ్చు. ఏర్పాటు చేసుకొనే రైతులు గ్రామపంచాయితీ లో దరఖాస్తు చేసుకోవాలి. ప్రతి గ్రామంలో ఉపాధి హామీ సిబ్బంది ద్వారా రైతులకు అవగాహన కల్పిస్తాం.

Drought awareness on farm ponds, fish pond

Leave A Reply

Your email address will not be published.