బతుకమ్మ, ఆర్మూర్ : ఆలూరు మండల కేంద్రంలో నాగుల పంచమి సందర్భంగా ప్రజలు పుట్టలో పాలు పోసి , నైవేద్యాలు సమర్పించి తమ యొక్క మోకులు సమర్పించుకున్నారు. ఈ సందర్భంగా సుధీర్ శర్మ మాట్లాడుతూ శ్రావణమాసం శుక్రవారం రోజున నాగుల పంచమి రావడం చాలా అరుదు అని, చాలా విశిష్టమైన రోజు అని ప్రజలు తమ మోకులు సమర్పించడం వల్ల శివుని వద్దకు చేరుతుందని , అని అన్నారు. ఈ కార్యక్రమంలో పెద్ద ఎత్తున భక్తులు, ప్రజలు పాల్గొన్నారు.