బతుకమ్మ,మోర్తాడ్ : మోర్తాడ్ మండలం లోని ధర్మోరా గ్రామంలో బుధవారం స్థానిక గ్రామపంచాయితీ భవనంలో వైద్య శిబిరం నిర్వహించినట్లు ఆరోగ్య సిబ్బంది సద్గుణ తెలిపారు.. పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి, మందులు అందజేశారు. పరిసరాలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని లేకుంటే అనారోగ్యం కలుగుతుందని గ్రామంలో ప్రజలకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో పంచాయతీ కార్యదర్శి అరుణ్, కారోబర్ సాయన్న, ఎం.ఎల్. హెచ్.పి లావణ్య, ఏఎన్ఎం దీప, ఆశ వర్కర్లు పద్మ, సుమలత తదితరులు పాల్గొన్నారు.