బతుకమ్మ పిట్లం : పిట్లం నుండి బాన్సువాడ వెళ్లే దారిలో నాగంపల్లి రోడ్డు దగ్గర, సిద్ధాపూర్ గ్రామ శివారులో భారీ గుంతలు ఏర్పడి ద్విచక్ర వాహనదారులు ప్రమాదాలకు గురవుతున్నారు.బాన్సువాడ నుండి పిట్లం వెళ్లే దారిలో మద్దెల చెరువు గ్రామం వద్ద భారీ గుంతలు ఏర్పడి ఇబ్బందులకు గురవుతున్నామని అటువైపు నుంచి వెళ్లే ద్విచక్ర వాహనదారులు తెలుపుతున్నారు. రోజుకు వందల సంఖ్యలో వాహనాలు రాకపోకలు జరుగుతాయి. ఈ రోడ్డుకు ఫారెస్ట్ అనుమతి కొరకు ఎదురుచూస్తున్నప్పటికీ ఎమ్మెల్యే చొరవ చూపడం లేదని వాహనదారులు ఆరోపిస్తున్నారు. గత ప్రభుత్వంలో మంజూరైన రోడ్ను ఇప్పటివరకు చేయకపోవడం సిగ్గుచేటని అంటున్నారు. ఇకనైనా అధికారులు స్పందించి గుంతలను పూడ్చాలని లేదా డబుల్ రోడ్డు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు.
