- నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి
ఇందల్వాయి,బతుకమ్మ : ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలు ప్రతి గడపగడపకు చేరాలని నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే రేకులపల్లి భూపతిరెడ్డి సూచించారు. నిజామాబాద్ రూరల్ లో ఉన్న ఏడు మండలాల ఉపాధి హామీ, ఐకెపి,సర్ఫ్ ఉద్యోగుల తో శుక్రవారం నిజాంబాద్ రాజీవ్ గాంధీ అరిటోరియంలో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ మహిళా శక్తి అనే పథకం ద్వారా ప్రతి పేద ఇంటికి అందేలా చూసేలా ఐకెపి సిబ్బంది అప్రమత్తంగా ఉండి అన్ని విధాల సౌకర్యాలు కల్పించి నిరుపేద కుటుంబాలకు చేయూతనునివ్వాలని సూచించారు.తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో సీఎం రేవంత్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టిన మహిళ శక్తి పథకాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ప్రతి మహిళ లక్షాధికారే కాకుండా ఉపాధి పొంది కోటీశ్వరులు కావాలనే సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తుందని పేర్కొన్నారు. వేల శక్తి ద్వారా పాడి గేదలు నాటు కోళ్ల పెంపకం వంటి ప్రేయసిన్ ఫుడ్ వర్క్స్ వంటి పథకాలు ఎన్నో ఉన్నాయని వాటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉపాధి హామీ సిబ్బంది అన్ని రాష్ట్రాల్లో కంటే తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రగామిగా ప్రథమ స్థానంగా నిల్పాలని ఆశాభావం వ్యక్తం చేశారు.ఇంతకు ముందు తెలంగాణ రాష్ట్రాన్ని మూడు మూడు సంవత్సరాలుగా తెలంగాణ రాష్ట్రన్ని ప్రథమ స్థానంలో నిపిన విధంగానే ఈసారి కూడా అన్ని రాష్ట్రాలతో పోటీపడి తెలంగాణ రాష్ట్రాన్ని ముందువరుసలో నిలపాలని ఆకాంక్షించారు. ఉపాధి హామీ కూలీలకు దినసరి వేతనం 200 నుండి 250 రూపాయలు వచ్చేటట్లుగా కొలతలు ఇవ్వాలని సూచించారు.ప్రభుత్వం నిర్వహిస్తున్న పథకాలలో ఎవరైనా నిర్లక్ష్యం వహించినట్లయితే వారి పైన కఠిన చర్యలు తీసుకోవడం జరుగుతుందని హెచ్చరించారు. ఇప్పటికైనా ఎవరైనా పొరపాట్లకు పాల్పడినట్లయితే తీరు మార్చుకోవాలని తెలిపారు..ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ సిబ్బంది, ఏపీవోలు ఐకెపి,ఎపిఎములుఫీల్డ్ అసిస్టెంట్స్ టెక్నికల్ అసిస్టెంట్స్ ,వివిధ అధికారులు పాల్గొన్నారు.