ఇందల్వాయి – ధర్పల్లి వెళ్లే రోడ్డు మూసివేత

487

. . .లింగాపూర్ వాగు బ్రిడ్జి వద్ద ఉధృతంగా పారుతున్న వాగు

ఇందల్వాయి,బతుకమ్మ

శనివారం రాత్రి నుండి భారీ నుండి అతి భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాలో రెడ్ అలర్ట్ గా ప్రకటించడం జరిగిన విషయం తెలిసిందే. రాత్రి నుండి భారీ వర్షాలు కురుస్తునందున ఇందల్వాయి నుండి ధర్పల్లి వెళ్లే లింగాపూర్ వాగు బ్రిడ్జి వద్ద ప్రధాన రహదారిని మూసి వేయడం జరిగిందని దీనిని ప్రజలు గమనించాలని ఎస్సై బి మనోజ్ కుమార్ తెలిపారు. రాత్రి నుండి కురుస్తున్న భారీ వర్షాలకు లింగాపూర్ వాగు బ్రిడ్జి ఉదృతంగా పారుతుంది.  కోత్త బ్రిడ్జీ నిర్మాణం పనుల కారణంగా పాత బ్రిడ్జీ మీద నుంచి వాగు నీరు అలుగు పారుతోంది. అదివారం, సోమవారం ప్రజలు,వాహనదారులు లింగాపూర్ వాగు మీదా ఉన్న బ్రిడ్జీ  ద్వార ప్రయాణం చేయకూడదని సూచించారు.బ్రిడ్జి దగ్గర ప్రమాదం పొంచి ఉన్నందున అట్టి మార్గాన్ని మూసివేయల్సి వచ్చిందని తెలిపారు.

Indalwai - Dharpalli road closure

Leave A Reply

Your email address will not be published.