గంజాయి అమ్ముతున్న వ్యక్తి అరెస్ట్

599
  •  500 గ్రాముల గంజాయి స్వాధీనం
  •  దాడులు చేసిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు

బతుకమ్మ, బోధన్ : ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ సోమిరెడ్డి ఆదేశాల మేరకు నవీపేట్ మండలం లో ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ అధికారులు దాడులు చేసి మండల కేంద్రంలోని రైల్వే స్టేషన్ ప్రాంతంలో గంజాయి అమ్ముతున్న నవీపేట్ కు చెందిన సయ్యద్ రఫీక్ ను అరెస్ట్ చేసి 500 గ్రాముల ఎండు గంజాయి ని స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ ప్రభుత్వ ఆదేశాల మేరకు గంజాయి, డ్రగ్స్ లాంటి మత్తు పదార్థాలు కలిగివున్న, సేవించిన చట్టరీత్యా కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఈ దాడులలో ఎక్సైజ్ ఎన్ఫోర్స్ మెంట్ సి.ఐ. వెంకటేష్, ఎస్సై నరసింహ చారి, సిబ్బంది భూమన్న, భోజన్న, అవినాష్, ఉత్తమ్, విష్ణు, రాంబచ్చన్, లక్ష్మణ్ పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.