- పలువురికి గాయాలు
బతుకమ్మ, నవీపేట్ ; పచ్చని పెళ్ళిపండిరి , మంగళ వాయిద్యాలతో జరుగుతున్న పెళ్లి విందులో జరిగిన ఘర్షణ లో పలువురికి గాయాలయ్యాయి. వివరాలు ఇలా ఉన్నాయి మండల కేంద్రానికి చెందిన వధువు కు నందిపేట్ మండలం భాద్గుణ కు చెందిన వరుడికి మండల కేంద్రలోని ఓ ఫంక్షన్ హాల్ లో వివాహం జరుగుతున్న సమయంలో భోజనాల వద్ద ఏర్పడిన ఘర్షణలో ఇరువర్గాల వారు కర్రలు, రాళ్లతో దాడి చేసుకోవడంతో భయపడిన సామాన్య జనం 100 కి డయల్ ఫోన్ చేయడంతో డ్యూటీ లో పోలీసులు ఘటనస్థలానికి చేరుకొని ఇరువర్గాల వారిని అదుపు చేసి గాయపడిన వారిని ఆసుపత్రికి తరలించారు. కానిస్టేబుల్ రాజేష్ ఫిర్యాదు మేరకు దాడి చేసుకున్న ఇరు వర్గాల పై కేసు నమోదు చేసినట్లు నవీపేట్ ఎస్సై వినయ్ తెలిపారు.