బతుకమ్మ: బిచ్కుంద : కామారెడ్డి జిల్లా బిచ్కుంద మండల కేంద్రంలోని ఎంపీడీవో కార్యాలయంలో గురువారం జాతీయ ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలను నిర్వహిస్తున్నట్లు బిచ్కుంద మండల విద్యాధికారి రాములు నాయక్ ఓ ప్రకటనలో తెలిపారు. ఇట్టి కార్యక్రమానికి మండల స్థాయి ఉపాధ్యాయులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పలువురు ఉపాధ్యాయులను సన్మానిస్తున్నట్లు ఆయన తెలియజేశారు.