సంతోష్ కుటుంబాన్ని పరామర్శించిన చిన్ననాటి మిత్రబృందం

1,253

బతుకమ్మ: బిచ్కుంద : బిచ్కుంద మండల కేంద్రానికి చెందిన సంతోష్ మండల కేంద్రంలో పాన్ షాప్ నడిపిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ఈయనకు ముగ్గురు కుమార్తెలు పెద్ద కుమార్తె సిద్దేశ్వరి బిచ్కుంద కస్తూర్బ పాఠశాలలో తొమ్మిదవ తరగతి చదువుతూ, ఇటీవల డెంగ్యూ వల్ల తీవ్ర అనారోగ్యానికి గురై వారం రోజుల క్రింద మృతి చెందిన విషయం అందరికీ తెలిసిందే విషయం తెలుసుకున్న 1997- 98 బ్యాచ్కు చెందిన చిన్ననాటి స్నేహితులు సంతోష్ కుటుంబాన్ని పరామర్శించి తనకు ఎల్లవేళలా తోడు ఉంటామని మనోధైర్యం కల్పించారు. మిత్ర బృందం కలిసి ఉడుత భక్తిగా సంతోష్ కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేశారు. ఈ సందర్భంగా సంతోష్ కుటుంబాన్ని కలిసిన వారిలో, మసూద్, నాల్చార్ శ్రీనివాస్, పండరి, నరేందర్, నాల్చర్ అనిల్, రాజ్ కుమార్, విశ్వనాథ్, నాగరాజ్, నాందేవ్, ముజీబ్, సచిన్, గజానన్, హనుమంతరావు, గంగాధర్, కృష్ణ, సంగప్ప, పరమేష్ లు ఆయనను కలిశారు.

Leave A Reply

Your email address will not be published.