మాజీ మేయర్, స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీ చైర్మన్ ధర్మపురి సంజయ్ వెల్లడి
బతుకమ్మ నిజామాబాద్ సిటీ : నిజామాబాద్ స్పోర్ట్స్ ప్రమోషన్ సొసైటీ ఆధ్వర్యంలో కీర్తిశేషులు ధర్మపురి శ్రీనివాస్ జన్మదినం పురస్కరించుకొని ఈనెల 23 నుంచి 27 వరకు నిజామాబాద్ జిల్లా కేంద్రంలో క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు మాజీ మేయర్, సొసైటీ చైర్మన్ డి సంజయ్ పేర్కొన్నారు. బుధవారం వినాయక నగర్ లోని ఆయన నివాసంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలోక్రీడా పోటీలకు సంబంధించిన వివరాలను వెల్లడించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూతన తండ్రి మరణించిన తర్వాత తొలి జన్మదిన పురస్కరించుకొని క్రీడాకారులు నైపుణ్యాన్ని పెంపొందించేందుకు ఈనెల 23 నుంచి 27 వరకు పాత కలెక్టర్ గ్రౌండ్ లో పాఠశాల, ఇంటర్మీడియట్ విద్యార్థినీ విద్యార్థులకు వేరువేరుగా కబడ్డీ, కోకో, వాలీబాల్, బాస్కెట్ బాల్, బాక్సింగ్ క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు ఆయన తెలిపారు. క్రీడా పోటీల సందర్భంగా తొలి రోజు నిర్వహించే మార్చి ఫస్ట్, ఇతర క్రీడా పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు మొదటి బహుమతిగా 5000 రూపాయలు, రెండవ బహుమతిగా 2000 రూపాయల ప్రోత్సాహక నగదును అందించనున్నట్లు ఆయన తెలిపారు. అలాగే పలు క్రీడల్లో గెలుపొందిన వారికి ముగింపు రోజున కూడా బహుమతులు ప్రధానం చేయబోతుందన్నారు. ఈ క్రీడలు ప్రతి సంవత్సరం తమ తండ్రి పేరిట ఈ క్రీడలు నిర్వహిస్తామన్నారు. అదేవిధంగా తమ నిర్వహించే ఈ క్రీడా పోటీలకు ప్రముఖ క్రీడాకారులు మలావత్ పూర్ణ, సౌమ్య, అసముద్దీన్ హాజరుకానున్నట్లు ఆయన వెల్లడించారు. క్రీడా పోటీల్లో సొసైటీ కోశాధికారి సంపత్, ప్రధాన కార్యదర్శి గౌతమ్, కార్యవర్గ సభ్యులుడి సురేందర్, పుప్పాలశోభ, డి సాయిలు తదితరులు హాజరుకానున్నట్లు ఆయన వెల్లడించారు.