బతుకమ్మ, మోర్తాడ్: మోర్తాడ్ మండలం ధర్మోరా గ్రామానికి చెందిన ముస్కు భూమారెడ్డి మరణించడం జరిగింది. ఈ విషయం తెలుసుకున్న డీ సీ సీ ప్రెసిడెంట్ మానాల మోహన్ రెడ్డి బుధవారం భూమా రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భూమారెడ్డి కుమారులు రాజేందర్ రెడ్డి, రమేష్ రెడ్డిలను వారి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు గురిజాల నర్సారెడ్డి, లక్మ రంజిత్, ఆనంద్, దేవేందర్, రాడే లిబన్న, పుప్పాల చిన్న నర్సయ్య తదితరులు పాల్గొన్నారు.