చేపూర్ లో ఘనంగా ప్రపంచ ఆదివాసి దినోత్సవ వేడుకలు

972

బతుకమ్మ, ఆర్మూర్ : చేపూర్ గ్రామంలో శుక్రవారం ప్రపంచ ఆదివాసి దినోత్సవ సందర్భంగా చేపూర్ ఆదివాసి నాయకపోఢ్ సంఘాల అధ్యక్షులు మేడిపల్లి గిరీష్, రాటం భూమన్న ఆధ్వర్యంలో కొమురం భీమ్ విగ్రహానికి పూల మాలాలు వేసి జెండా ఆవిష్కరణ నిర్వహించి. మిఠాయిలు పంచుకున్నారు.ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా ఆర్మూర్ కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు ఎస్కె చిన్న రెడ్డి హాజరై మాట్లాడుతూ ఆదివాసీ హక్కుల పరిరక్షణ కొసం 1994 లో ఐక్యరాజసమితి ఆగష్టు 9 ఆదివాసుల దినోత్సవంగా ప్రకటించిందని 1994 డిసెంబర్ 23న ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తన తీర్మానం 49/214లో ప్రతి సంవత్సరం ఆగస్టు 9న ప్రపంచ ఆదివాసీ ప్రజల కోసం అంతర్జాతీయ దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించిందని సందర్భంగా వారు గుర్తు చేస్తూ చేపూర్ గ్రామంలో ఉన్న ఆదివాసి నాయకపోఢ్ కులస్తులందరికీ ప్రపంచ ఆదివాసి దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం తరఫున రాష్ట్ర ప్రభుత్వ పథకాలను చేపూర్ గ్రామంలో మొదటగా ఆదివాసి కులస్తులకు చెందే విధంగా ఆర్మూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ పొద్దుటూరి వినయ్ రెడ్డితో మాట్లాడి కృషి చేస్తానని, ఇందిరమ్మ ఇండ్లు, రేషన్ కార్డ్స్, పెన్షన్ లేని వారికి కూడా అందే విధంగా కృషి చేస్తానని, సంఘ భవన నిర్మాణానికి తొందర్లో 5 లక్షల ప్రోసిడింగ్ కూడా ఇప్పిస్తానని ఆదివాసి నాయకపోఢ్ సంఘ సభ్యులకు భరోసా ఇచ్చారు ఈ కార్యక్రమానికి ఆదివాసి నాయకపోఢ్ ఉద్యోగుల సేవా సంఘం ప్రధాన కార్యదర్శి కొసెడుగు రవి, విడిసి అధ్యక్షులు మేడిపల్లి శ్రీకాంత్, మాజీ సర్పంచులు ఇందూర్ సాయన్న, సత్యనారాయణ, కె గంగారెడ్డి. మాజీ ఎంపీటీసీలు, జన్నేపల్లి గంగాధర్, బాల్ నర్సయ్య, సారంగి శాంతి కుమార్, న్యాయవాది సింధుకర్ చరణ్ .గ్రామ కోశాధికారి రుక్మాజి ఆర్మూర్ మండల ఆదివాసి నాయకపోఢ్ ప్రధాన కార్యదర్శి మేడిపల్లి గౌతం, తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.