బతుకమ్మ న్యూస్ నిజామాబాద్ సిటీ : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసుల అభివృద్ధికి తోడ్పాటుకు కృషి చేయాలనిటి పి ఆర్ టి యు జిల్లా అధ్యక్షుడు కృపాల్ సింగ్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడుతూ ముఖ్యంగా ఆదివాసీల జీవనవిధానం, పాత్ర, వారినీ, వారి సంఘాలనూ కాపాడుకోవ్వాల్సిన అవసరా న్నీ గుర్తించడానికీ అవగాహన కల్గించడానికే, ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ 23 డిసెంబర్ 1994లో చేసిన తీర్మానం ప్రకారం ప్రపంచం ఆదివాసీల అంతర్జాతీయ దినోత్సవాన్నీ నిర్వహించాలనీ నిర్ణయించిందన్నారు.

విద్యా, సంస్కృతి, ఆరోగ్యం, ఆర్థిక, సామజిక అభివృద్ధి వంటి సమస్యలపై పనిచేయడమే దీని లక్ష్యమని, ఈ రోజున స్వదేశీ, సమాజాల సహకారం విజయాల ద్వారా అందించిన సేవలను గుర్తించడానికి ఈ రోజును అంకితం చేయబడినా.. నేటికీ ఎన్నో ఆదివాసీకుటుంబాలకు అరకొరసౌకర్యాలు, తినడానికి కడుపునిండాతిండి,ఉండానికి నివాసాలు లనీ కుటుంబాలున్నాయంటే… దానికి వారి సంస్కృతి సంప్రదాయాల్లో వున్న ఆచారాలు, దానికి తోడు నిరక్షరాస్యత వెనుకబాటు తనానికి కారణభూతాలౌతున్నాయి.. కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా హితోదిక కార్యక్రమాల ద్వారా వారి అభివృద్ధికి తోడ్పాటునదించాల్సిన అవసరమెంతైనా వుందన్నారు.
