వాట్సప్ వాయిస్ మెసేజ్ లతోఘర్షణ
బతుకమ్మ, వర్ని: బాన్సువాడ నియోజకవర్గంలో ఉప్పు నిప్పుల ఉన్న వాతవరణం వేడెక్కుతుంది. ఎనుగు రవింధర్ రెడ్డి, పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్గీయుల మద్యం గ్రూప్ రాజకీయాలు అట్టుడుకుతుంది బాన్సువాడ నియోజకవర్గం. బాన్సువాడ నియోజకవర్గం ఇంచార్జీ ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం,ఇటీవల బారాస నుంచి కాంగ్రెస్ లోకి చేరిన ఎమ్మెల్యే పోచారం శ్రీనివాస్ రెడ్డి వర్గీయుల మధ్య వాట్సప్ లో చేసుకుంటున్నా తిట్ల పురాణం, చివరికి దాడులకు దారి తీసింది .

ఈ ఘటన నిజామాబాద్ జిల్లా వర్ని మండలం వడ్డేపల్లి లో చోటుచేసుకుంది. కాంగ్రెస్ నాయకుడు భీమశంకర్ తమపై ఇష్టం వచ్చినట్లు వాయిస్ మెసేజ్ లు పెడుతున్నట్లు గోపాల్ తో పాటు ఆయన కొడుకు మరి కొంతమంది కలిసి గురువారం రాత్రి భీమశంకర్ ఇంటిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. పోలీసులు అడ్డుకున్నప్పటికీ వారిని పక్కకు పెట్టి ఇరు వర్గాలు దాడులకు పాల్పడ్డారు. వీరిద్దరి మధ్య కొన్ని రోజులుగా వాట్సప్ లో వాయిస్ మెసేజ్ ల తిట్ల పురాణం కొనసాగుతుంది. చివరికి ఇది ఘర్షణకు దారితీసింది. ఏనుగు రవీందర్ రెడ్డి వర్గానికి చెందిన బీమా శంకర్ ఇంట్లో చొరబడి ఇటీవల బారాస నుంచి కాంగ్రెస్ లో చేరిన గోపాల్ పోచారం వర్గంలో ఉన్నారు.
గ్రామంలో కొన్ని రోజులుగా ఘర్షణ వాతావరణం నెలకొంది. బుధవారం రాత్రి ఏనుగు రవీందర్ రెడ్డి వర్గానికి చెందిన వడ్డేపల్లి వర్ని గ్రామస్తుడు కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడైన భీమశంకర్ పై పోచారం శ్రీనివాస్ రెడ్డి ప్రధాన అనుచరులు మాజీ ఏఎంసీ వైస్ చైర్మన్ గోపాల్ గ కుమారులు, వెలగపూడి జయంత్ వెలగపూడి యశ్వంత్ (బన్నా ) శ్రీనగర్ మాజీ ఉపసర్పంచ్ ముప్పవరపు అన్వేష్ నెహ్రు నగర్ మాజీ సర్పంచ్ నాని బాబు శ్రీనగర్ మాజీ వార్డ్ మెంబర్ మేక రాజేష్ గంట వేణుచైతన్య అలియాస్ (బాబి) వీరితోపాటు అందరూ చూస్తుండగా పోలీస్ స్టేషన్లో దాడి చేసిన వ్యక్తుల్లో శ్రీనగర్ మాజీ సర్పంచ్ రాజు శ్రీనగర్ గ్రామానికి చెందిన కోనేరు శ్రీకాంత్ అందరు కలిసి దాడి చేసినట్లు భీమశంకర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.
కాంగ్రెస్ నాయకుడు భీమా శంకర్ తో పటు ఆయన కుమారుడు పై దాడికి పాల్పడ్డ గోపాల్, ఆయన కుమారులు, ఆయన అనుచరులు పై కఠినంగా చర్యలు తీసుకోవాలంటూ ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం తీవ్రంగా ఆరోపిస్తున్నారు. లేనియెడల తామే ప్రత్యక్షంగా పోరాటానికి దిగుతామని ఏనుగు రవీందర్ రెడ్డి వర్గం హెచ్చరిస్తుంది