నిజామాబాద్, బతుకమ్మ: రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా నియమితులైన మహేశ్ కుమార్ గౌడ్ హైదరాబాద్ లో మాజీ మంత్రి, బోధన్ ఎమ్మెల్యే సుదర్శన్ రెడ్డిని సోమవారం మర్యాదపూర్వకంగా కలిసి సన్మానించారు. ఆయన వెంట జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు, రాష్ట్ర సహకార యూనియన్ లిమిటెడ్ చైర్మన్ మానాల మోహన్ రెడ్డి , పీసీసీ ప్రధాన కార్యదర్శి గడుగు గంగాధర్, రాష్ట్ర ప్రచార కమిటీ సభ్యులు ఏ వీ శ్రీనివాస్, మెండోరా మండల కాంగ్రెస్ అధ్యక్షుడు ముత్యంరెడ్డి తదితరులున్నారు.