బతుకమ్మ నిజామాబాద్ సిటీ : ప్రభుత్వ జనరల్ ఆసుపత్రిలో డైట్ సప్లై టెండర్లను పూర్తిగా రద్దు చేయాలని, ప్రజా పాలన రాష్ట్రంలో వచ్చింది కానీ నిజామాబాద్ ప్రభుత్వ ఆసుపత్రికి ఇంకా రాలేదని డైట్ టెండర్ లో పాల్గొన్న టెండర్ దారులు అంబేద్కర్ ఎస్.సి. లెబోర్ కాంట్రాక్ కో-ఆప్ సొసైటీ లిమిటెడ్ అద్యక్షులు నాయుడు రాజు ఆరోపించారు. జిల్లా కేంద్రంలోని ఆర్ అండ్ బి ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టెండర్ నోటిఫికేషన్ కు ముందు నుండే కొందరు అధికారులు టెండర్ దారులతో కుమ్మక్కయ్యారని ఆరోపించారు. గతంలో డైట్ సప్లై చేసిన వారికి టెండర్ ధక్కేలా అన్ని రకాల ప్రయత్నాలు చేస్తున్నారని అన్నారు. అంతేకాకుండా గతంలో డైట్ సప్లై చేసిన వారు తప్పు చేశారు అన్న విషయాన్ని పలు మీడియా పత్రికల్లో వచ్చాయన్నారు. ఇప్పటికైనా దీనిపైన జిల్లా కలెక్టర్ దీనిపై దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు నాయుడు రాజు, మాల మహానాడు జిల్లా ఉపాధ్యక్షులు బత్తుల కిష్టయ్య, బీసీ నాయకులు దేవేందర్ యాదవ్, కాంగ్రేస్ ఎస్టి సెల్ నగర అదక్షులు సుభాష్ జాదవ్ తదితరులు పాల్గొన్నారు.