. . అప్రమత్తంగా ఉండాలని ప్రాజేక్టు అధికారులు హెచ్చరిక
బతుకమ్మ, నిజాం సాగర్ :
ఉమ్మడి నిజామాబాద్ జిల్లా వరప్రదాయని నిజాం సాగర్ ప్రాజేక్టు నిండుకుండాలా మారింది. మంజీర పరివాహక ప్రాంతంలో బారీ వర్షాలు, నిజాం సాగర్ బ్యాలెన్సింగ్ రిజార్వయర్ ల గేట్లను ఎత్తడంతో నిజాం సాగర్ కు ఇన్ ప్లో పేరిగింది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలతో నిజాం సాగర్ కు జలకళ వచ్చింది. గత నెల చివరి వారం వరకు 3 టియంసీల నీరు ఉన్న ప్రాజెక్టులో ప్రస్తుతం 15.199 టియంసీల నీరు ఉంది. ప్రాజెక్టు సామర్థ్యం 17.802 కాగా ప్రస్తుతం 18,000 క్యూసెక్కుల వరధ వస్తుంది. సాయంత్రం వరకు ప్రాజెక్టు నిండే అవకాశాలు ఉండటంతో ప్రాజేక్ట్ అధికారులు ఎక్షణమైన డ్యాం గేట్లను ఎత్తుతామని ప్రకటన జారీ చేశారు .నిజాంసాగర్ ప్రాజెక్ట్ ఎగువ పరివాహక ప్రాంతం లో భారీ వర్ష సూచన కారణంగా బుదవారం 5.00 గంటలకు ప్రాజెక్ట్ వరద గేట్లు ఎత్తి మంజీర నది లోకి వదిలే అవకాశం ఉన్నదని తెలిపారు . రెవిన్యూ పోలీస్ శాఖ అధికారులు తగు ముందు జాగ్రత్త చర్యలు తీసొకొవలసిందిగా నది పరివాహక గ్రామాలలో దండోరా వేయించాల్సిందిగా విజ్ఞప్తి చేశారు.నదీ పరివాహక ప్రాంతం లోకి పశువులు ,గొర్రెలు వెళ్లకుండా అలాగే చేపలు పట్టేవారు, గొర్రె కాపరులు రైతులు వెళ్లకుండా అప్రమత్తం గా ఉండాలని కోరారు.