- రైతు సంక్షేమమే కాంగ్రెస్ ప్రభుత్వ ధ్యేయం
- బాల్కొండ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ ముత్యాల సునీల్ కుమార్
బతుకమ్మ,మోర్తాడ్: : రుణమాఫీ ప్రక్రియ పూర్తికాకుండానే మూడో విడత రుణమాఫీ రాకముందే రుణమాఫీ కాలేదని ధర్నా చేస్తున్నట్లు వేముల ప్రశాంత్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ ప్రకటించడం పట్ల ప్రజలు నవ్వుకుంటున్నారని వారి దొంగ ధర్నాలను ప్రజలు పట్టించుకోరని బాల్కొండ నియోజకవర్గం ఇన్చార్జి ముత్యాల సునీల్ కుమార్ అన్నారు. మోర్తాడ్ మండల కేంద్రంలోని ప్రజా నిలయంలో ఆదివారం సునీల్ కుమార్ విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇచ్చిన మాటను నిలబెట్టుకుని రుణమాఫీ ప్రక్రియను మొదలు పెట్టారని రుణమాఫీ ప్రక్రియ పూర్తిగా జరగకముందే ధర్నాల పేరుతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని పేర్కొన్నారు. నిన్న రుణమాఫీ ధర్నా కార్యక్రమంలో పాల్గొన్న చాలామంది టిఆర్ఎస్ పార్టీ శ్రేణులకు లక్షల రూపాయల రుణమాఫీ జరిగిందని ప్రశాంత్ రెడ్డి రుణమాఫీ జరిగిందా లేదా అని అడిగితే చేతులు అడ్డంగా ఊపారని వారి మనస్సాక్షిగా రుణమాఫీ జరిగిందో లేదో గుండెల మీద చేయి వేసుకొని ఆలోచించుకోవాలని తెలిపారు. భుత్వం రైతు రుణమాఫీకి రూ. 31 వేల కోట్ల కేటాయించిందని ఇప్పటికీ 18,500 కోట్ల రూపాయలు మాత్రమే రుణమాఫీ జరిగిందని మరో రూ.12,5000 వేల కోట్ల రుణమాఫీ జరగాల్సిన అవసరం ఉందని అన్నారు. రుణమాఫీ ప్రక్రియ ఇప్పుడు మధ్య దశలో ఉందని పూర్తి రుణమాఫీ జరగడానికి ప్రభుత్వం వ్యవసాయ శాఖ అధికారులకు కుటుంబాలను గుర్తించే పనిని అప్పజెప్పిందని తప్పకుండా ప్రతి కుటుంబానికి రెండు లక్షల రూపాయల రుణం మాఫీ అవుతుందని ఆయన తెలిపారు. బ్యాంకు టెక్నికల్ సమస్యల వల్ల కొంతమందికి రుణమాఫీ కాలేదని అలాగే రేషన్ కార్డు లేకపోవడం వల్ల తెలంగాణ రాష్ట్రంలో ఆరు లక్షల 50 వేల కుటుంబాలకు రుణమాఫీ జరగలేదని ఇప్పుడు ఈ సమస్యలను పరిష్కరించి కుటుంబాలను గుర్తించి టెక్నికల్ సమస్యలను సవరించి రుణమాఫీ చేసే బాధ్యత ప్రభుత్వాన్నిదని రైతులు ఎవరు అధైర్య పడద్దని దొంగ ధర్నాలకు వెళ్ళవద్దని ఆయన సూచించారు. గత ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు పొట్టకూటి కోసం గల్ఫ్ వెళ్లిన వారికి రేషన్ కార్డులను దూరం చేసి పాపం చేసిందని ఇప్పుడు వారికి రుణమాఫీ రాలేదని వారే నోరు పెట్టుకుని అరుస్తున్నారని రేషన్ కార్డులు ఇవ్వని ప్రశాంత్ రెడ్డి అప్పటి ప్రభుత్వంపై ప్రజలు విరుచుకుపడాలని ఆయన తెలిపారు . దొడ్డిదారిన గత ప్రభుత్వంలో టిఆర్ఎస్ కార్యకర్తలు రేషన్ కార్డులు జారీ చేయించుకున్నారని అసలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల కుటుంబాలకే రేషన్ కార్డులు లేవని ఎప్పుడు రుణమాఫీ జరిగిందంతా ధర్నా పేరుతో రోడ్డు మీద కూర్చున్న టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు జరిగిందని తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం నలభై లక్షల ఖాతాలకు తప్పకుండా 31 వేల కోట్ల రుణాన్ని మాఫీ చేస్తుందని అన్నారు. ప్రశాంత్ రెడ్డి రైతు వ్యతిరేకి అని పదేళ్ల ఏలుబడిలో ఆయన బాల్కొండ నియోజకవర్గ రైతులకు చేసిందేమీ లేదని రివర్స్ పంపిన పేరుతో వందల కోట్ల రూపాయల కమిషన్లు తిని ఎన్నికల్లో కోట్ల రూపాయలను ఖర్చుపెట్టి గెలిచి ఏదో సాధించాలని భ్రమ పడుతున్నారని ప్రజలకు ఆయన గెలుపు నచ్చడం లేదని అన్నారు. భీంగల్,వేల్పూర్ మండల రైతులకు ప్రశాంత్ రెడ్డి నీరు అందించక తీవ్ర అన్యాయం చేశారని ఆయన అన్నారు కాంగ్రెస్ ప్రభుత్వం వారి సమస్యను తీర్చే ప్రయత్నం చేస్తుందని తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పట్ల రైతులకు అభిమానం ఉందని ఆయన పట్ల అంచేంచలమైన విశ్వాసం ఉందని కాంగ్రెస్ ప్రభుత్వం రైతు పక్షపాత ప్రభుత్వమని ప్రతి రైతును కాపాడుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్నిదని ఆయన తెలిపారు. కార్యక్రమంలో అన్ని మండలాల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు,జిల్లా ఉపాధ్యక్షులు, మాజీ సర్పంచులు, మాజీ ఎంపీటీసీలు,మాజీ మున్సిపల్ చైర్మన్, సొసైటీ చైర్మన్, కాంగ్రెస్ పార్టీ అనుబంధ సంఘాల అధ్యక్షులు, యువజన సంఘాల అధ్యక్షులు, మైనారిటీ అధ్యక్షులు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.