. . . నిజాంసాగర్ కు పెరిగిన ఇన్ ఫ్లో
. . . అదనంగా రెండు గేట్లు ఎత్తివేత
బతుకమ్మ, నిజాంసాగర్ : మంజిరా నది పరివాహక ప్రాంతంలో కురిసిన వర్షాల వల్ల సింగూరు ప్రాజెక్టుకు 45 వేల క్యూసెక్కులు వరద నీరు ఇన్ ఫ్లో వస్తుంది. ప్రాజెక్టు వరద గేట్ల ద్వారా వరద నీటిని విడుదల చేశారు. దానితో నిజాంసాగర్ ప్రాజెక్టులోకి వరద ఉధృతి పెరగడంతో మూడు గేట్ల ద్వారా నీటిని విడుదల చేస్తున్నారు. బుధవారం సాయంత్రం ఒక గేటు ద్వారా నీటిని వదలగా ఇన్ ఫ్లో పెరగడంతో గురువారం ఉదయం మరో రెండు గేట్లను తెరిచారు. ఎగువ నుంచి 25 వేల క్యూసెక్కుల నీరు వస్తుండడంతో ప్రాజెక్టు మూడు వరద గేట్ల ద్వారా 15 వేల క్యూసెక్కుల నీటిని మంజీరలోకి విడుదల చేస్తున్నట్లు ఏఈ శివప్రసాద్ తెలిపారు. ఇన్ ఫ్లో పెరుగుతుండడంతో నీటి విడుదలను మరింత పెంచనున్నట్లు ఆయన పేర్కొన్నారు. ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటిమట్టం 17.80 టీఎంసీలు కాగా 17.07 టీఎంసీల నీరు నిల్వ ఉంది.