బతుకమ్మ నిజామాబాద్ సిటీ : మానసిక దివ్యాంగుల అభివృద్ధికి స్నేహ సొసైటీ చేస్తున్న కృషి అభినందనీయం అని జిల్లా సంక్షేమ అధికారిని రసూల్ బి అన్నారు. నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నూతన కలెక్టరేట్ బైపాస్ రోడ్డు సమీపంలో గల స్నేహ సొసైటీ ఫర్ రీ కన్స్ట్రక్షన్ ఆధ్వర్యంలో కొనసాగుతున్న అందుల వనరుల పాఠశాలలో అంద విద్యార్థుల తల్లిదండ్రులు ఉపాధ్యాయులతో సంయుక్త సమావేశం ఏర్పాటు చేశారు.. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా సంక్షేమ అధికారిని రసూల్ బి, అతిథులుగా మాజీ కార్పొరేటర్ లు చంద్రకళ, మాయ వర్ సాయిరాం తదితరులు పాల్గొన్నారు.. ఈ సందర్భంగా జిల్లా సంక్షేమ అధికారిని రసూల్ బి మాట్లాడుతూ స్నేహ సొసైటీ స్వచ్ఛంద సంస్థ మానసిక దివ్యంగుల సంక్షేమం అభ్యున్నతి కోసం చేస్తున్న కృషి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని తెలిపారు.. స్నేహా సొసైటీ విద్యార్థులు దివ్యాంగులయినప్పటికీ ఆరోగ్యవంతులుగా ఉన్న పిల్లలతో సమానంగా పోటీ పడుతూ అన్ని రంగాల్లో రాష్ట్ర, జాతీయస్థాయిలో సైతం ప్రత్యేక గుర్తింపు సంపాదించుకున్నారన్నారు అయితే తన వంతు బాధ్యతగా దివ్యాంగుల సంక్షేమం కోసం కృషి చేస్తున్న స్నేహ సొసైటీకి ఉపాధ్యాయ బృందానికి మరియు దివ్యంగా విద్యార్థుల అభ్యున్నతి కోసం వారికి కావాల్సిన వసతులపై రాష్ట్ర కమిటీకి నివేదిక పంపించడం జరుగుతుందని తెలిపారు.. అలాగే అంద విద్యార్థుల ఎయిడెడ్ పాఠశాల కోసం తమ వంతు బాధ్యతగా కృషి చేస్తానని తెలిపారు..విద్యార్థులను రాష్ట్ర జాతీయ స్థాయిలో జరిగే ఆయా రకాల పోటీలకు పంపేదుకు కృషిచేస్తానని తెలిపారు.. దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా సమయం కేటాయించి దివ్యాంగుల మధ్యకు రావడం ఎంతో సంతోషంగా ఉందని వారు తెలిపారు. అనంతరం మాజీ కార్పొరేటర్లు చంద్రకళ, మాయావర్ సాయిరాం లు మాట్లాడుతూ సేవాకు మారుపేరుగా నిలిచిన స్నేహ సొసైటీకి గురించి ఎంత చెప్పిన తక్కువేనని వారు తెలిపారు.. ఎంతోమంది అంద విద్యార్థులు గాని మానసిక దివ్యాంగ విద్యార్థులు గాని ఉన్నత శిఖరాలు అధిరోహించారన్నారు.. ఎప్పుడైతే విద్యార్థుల అభ్యున్నతి ఉపాధ్యాయులు తల్లిదండ్రులు ప్రతి ఒక్కరి ప్రోత్సాహం సమన్వయంతోనే సాధ్యమన్నారు.. అలాగే పిల్లల తల్లిదండ్రులు మాట్లాడుతూ పిల్లల సంరక్షణ విషయంలో ఇంట్లో కన్నా స్నేహ సొసైటీ అందుల వనరుల కేంద్రంలో కి పంపినప్పటి నుండి వారిలో ఎంతో మార్పు వచ్చిందని చదువులో ముందడుగులో కూడా ఉన్నారని సంతోషం వ్యక్తం చేశారు.. పిల్లలు ఉన్నత స్థాయికి ఎదుగుతారని నమ్మకం ఉందని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో స్నేహ సొసైటీ ప్రిన్సిపాల్ జ్యోతి, వైస్ ప్రిన్సిపాల్ రాజేశ్వరి, కార్యదర్శి సిద్దయ్య , రిటైర్డ్ ఈఐఎస్ఐ జీవన్ రావు, విద్యార్థుల తల్లిదండ్రులు రజిత, పరమేశ్వరి, ఉపాధ్యాయులు లక్ష్మి, రాకేష్ తదితరులు పాల్గొన్నారు.
