. . . ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ అలీ షబ్బీర్ కి సమ్మతి పత్రం అందచేసిన ఉద్యోగ జేఎసీ
బతుకమ్మ, నిజామాబాద్: రాష్ట్ర ప్రభుత్వ సలహదారు మహమ్మద్ అలీ షబ్బీర్ తో సమావేశమైన నిజామాబాద్ జిల్లా ఉద్యోగుల జేఏసీ వరదలతో అతలకుతలమైన ప్రాంతాల ప్రజలకు ఉద్యోగుల ఒకరోజు వేతనం అందజేశారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఉద్యోగ జేఎసీ చైర్మెన్ అలుక కిషన్ అధ్వర్యంలో నిజామాబాద్ ఉద్యోగుల కు సంబందించిన ఒక రోజు వేతనం రూ.5 కోట్ల సంబంధించిన సమ్మతి పత్రాన్ని షబ్బీర్ అలీకి అందజేశారు. ఈ సందర్బంగా జిల్లాకు చెందిన ప్రభుత్వ ఉద్యోగులను అభినందించారు. ఉద్యోగులు తమ సమస్యలను షబ్బీర్ అలీ కి విన్నవించుకోగా సానుకూలంగా స్పందించి ముఖ్యమంత్రి రేవంత్ దృష్టికి తీసుకెళ్లి మీ న్యాయబద్ధమైన సమస్యలను పరిష్కరించే విధంగా చూస్తానన్నారు
