బతుకమ్మ, మోర్తాడ్
మోర్తాడ్ మండలం సుంకెట్ గ్రామ శివారులో పేకాట స్థావరంపై శుక్రవారం టాస్క్ ఫోర్స్ పోలీసులు దాడులు నిర్వహించారు. పోలీసు కమిషనర్ కల్మేశ్వర్ ఆదేశాల మేరకు పేకాట స్థావరంపై దాడి నిర్వహించారు. సుంకెట్ గ్రామ శివారులోని ఓ ప్రాంతంలో పేకాట ఆడుతున్న 8 మందిని అదుపులోకి తీసుకుని రూ.12,170 నగదు, 9 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని మోర్తాడ్ పోలీస్ స్టేషన్ కు అప్పగించారు. పట్టుబడిన వారు బీఆర్ఎస్ పార్టీకి చెందిన వారని తెలిసింది. అందులో మాజీ ఉప సర్పంచ్ తో పాటు మరికొందరు పట్టుబడిన వారిలో ఉన్నారు.