బతుకమ్మ, ఆర్మూర్ : అంకాపూర్ గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త, లాలన వృద్ధాశ్రమ వ్యవస్థాపకులు పైపుల రాజారెడ్డి ఇటీవల మరణించిన సంగతి తెలిసిందే. ఎం జె హాస్పిటల్ డాక్టర్ మధు శేఖర్ రాజారెడ్డి కుటుంబ సభ్యులను బుధవారం పరామర్శించారు. వారి కుటుంబానికి మనోధైర్యాన్ని కల్పించారు. రాజారెడ్డి చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఆయన వెంట వీఆర్ హాస్పిటల్ డాక్టర్ ముత్యంరెడ్డి ఉన్నారు.