మల్టీజోన్ -1లో 8 మంది సిఐల బదిలీ

1,608
  • . . . నిజామాబాద్ పోలీసు కమిషనరేట్  8 మందికి స్థానచలనం
  • . . . నిజామాబాద్ నగర సిఐగా శ్రీనివాస్ రాజ్ 
  • . . . 1వ టౌన్ ఎస్ హెచ్ వో గా రఘుపతి 

బతుకమ్మ, నిజామాబాద్

పోలీసు శాఖలో మల్టీజోన్ 1 పరిధిలో 8 మంది సిఐలను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. అందులో నిజామాబాద్ పోలీసు కమిషనరేట్ పరిధిలో  ఏడుగురు సిఐలకు స్థానచలనం కలిగించారు. ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేస్తూ నిజామాబాద్ పోలీసు కమిషనర్ కల్మేశ్వర్ ఉత్తర్వులు జారీ చేశారు. నిజామాబాద్ 1వ టౌన్ ఎస్ హెచ్ వో విజయబాబు బోధన్ రూరల్ సర్కిల్ కు, ఐజి కార్యాలయంలో వెయిటింగ్ లో ఉ న్న బి.రఘుపతి ఆయన స్థానంలో పోస్టింగ్ ఇచ్చారు. బోధన్ రూరల్ సిఐ నరేష్ కుమార్ ను నిజామాబాద్ ట్రాఫిక్ కు బదిలీ చేశారు. నిజామాబాద్ ట్రాఫిక్ లో పని చేస్తున్న వెంకట్ నారాయణను బోధన్ టౌన్ ఎస్ హెచ్ వోగా నియమించారు. బోధన్ టౌన్ ఎస్ హెచ్ వోగా ఉన్న వీరయ్యను నిజామాబాద్ సీసీఆర్ బికి బదిలీ చేశారు. నిజామాబాద్ సీసీఆర్ బిలో పని చేస్తున్న శ్రీనివాస్ రాజ్ నిజామాబాద్ నగర సిఐగా బదిలీ చేశారు. నిజామాబాద్ నగర సిఐగా ఉన్న నరహరిని, టాస్క్ ఫోర్స్ లో ఉన్న అంజయ్యలను ఐజి కార్యాలయంలో రిపోర్టు చేయాలని ఉత్తర్వులు జారీ చేశారు.

Leave A Reply

Your email address will not be published.