రైతులకు సంపూర్ణ ఋణ మాఫీ వెంటనే చెయ్యాలి

1,294
  • ఋణ వడ్డీని నేటి వరకు ప్రభుత్వమే భరించాలి.
  • రైతుల వెంటే బీయర్ఎస్ ఉండి పోరాడుతుంది.
  • భరోసా పై బీయర్ఎస్ పోరు బాకీ ఉంది
  • మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి

బతుకమ్మ, భీంగల్ : ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ రైతన్నలకు ఇచ్చిన రూ. 2 లక్షల రైతు ఋణమాఫీని ఎలాంటి షరతులు, ఆంక్షలు లేకుండా వెంటనే సంపూర్ణ ఋణమాఫిని చెయ్యాలని మాజీ మంత్రి, బాల్కొండ ఎమ్మెల్యే వేముల ప్రశాంత్ రెడ్డి అధికార కాంగ్రెస్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గురువారం వేల్పూర్ మండల కేంద్రంలో బీయర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో షరతులు లేకుండా రైతులకు ఋణమాఫీ చెయ్యాలని, కెసీయర్ పై సీ. ఎం రేవంత్ రెడ్డి చేసిన అనుచిత వ్యాఖ్యాలను వాపస్ తీసుకొని కెసీయర్ కు క్షేమపణ చెప్పాలని డిమాండ్ చేస్తూ తహసీల్దార్ ఆఫీస్ ఎదుట బైటయించి, తహసీల్దార్ కు వినతి పత్రం ను అందజేశారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి డౌన్ డౌన్, ఇదేమి రాజ్యం ఇదేమి రాజ్యం దొంగల రాజ్యం దోపిడీ రాజ్యం, రైతులందరికి వెంటనే ఋణమాఫీ చెయ్యాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే మాట్లాడుతూ డిసెంబర్ 9 కీ ముందు ఫ్రెష్ గా తీసుకొన్నవారికి రుణమాఫీ ఇవ్వమని ప్రభుత్వం అంటున్నట్లు తెలిసింది అలా కాకుండా సీ. యం రేవంత్ రెడ్డి రైతులకు ఇచ్చిన హామీ ప్రకారం అందరికి రుణమాఫీ చెయ్యాలని, వడ్డీ రుణమాఫీ చేసే రోజు వరకు ప్రభుత్వమే భరించాలని అన్నారు.ఆంక్షలు, షరతులు లేకుండా అందరికి రుణమాఫీ చేయాలని లేదంటే బీయర్ఎస్ పార్టీ రైతుల పక్షాన పోరాడుతుందన్నారు. పోరాటం బీయర్ఎస్ పార్టీకి, పార్టీ నాయకులు కార్యకర్తలకు కొత్త కాదని, పార్టీయే పోరాట పార్టీ అని అన్నారు. ఒకవేళ మాట తప్పి ప్రభుత్వం రైతులని మోసం చెయ్యాలని చూస్తే, గ్రామాల వారిగా గ్రామంలోని కాంగ్రెస్ నేతలని నిలదీస్తామని, వారిపై ఒత్తిడి పెట్టి రాష్ట్ర వ్యాప్తంగా పోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. ఈ రుణమాఫీ అందరికీ సంపూర్ణగా అయిన తర్వాత రైతు భరోసా పై ఉద్యమం చేస్తామన్నారు. రైతులకు, అన్ని వర్గాల ప్రజలకు అండగా ఉండి ప్రభుత్వం తలలు వంచి వారిచ్చిన హామీలన్ని అమలు చేసే వరకు పోరాటం చేసేందుకు బీయర్ఎస్ సైన్యం సిద్ధంగా ఉండాలని ప్రశాంత్ రెడ్డి పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వేల్పూర్ మండలం నాయకులు, కార్యకర్తలు,రైతులు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.

Leave A Reply

Your email address will not be published.