బతుకమ్మ నిజామాబాద్ సిటీ : తెలంగాణా ప్రభుత్వ డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయుష్ ప్రభుత్వ ఆయుర్వేద ఆధ్వర్యంలో నవీపేట్ లో గురువారం వృద్ధాప్య వైద్య శిభిరం ను జిల్లా ఆయుష్ విభాగం జిల్లా ఇన్చార్జి డా..నారాయనారావు గధన్వంతరి విగ్రహానికి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. డా.. నారా యానారావు మాట్లాడుతు ఈ వృద్ధాప్య వైద్య శిభిరం లో దీర్ఘకాలిక వ్యాధులకు అన్ని రకాల వ్యాధులకు చికిత్సలు నిర్వహించి ఉచితముగా ఔషధము లు అందరికీ పంపిణీ చేశామని తెలిపారు. నవీపేట ఆయుర్వేద వైద్యురాలు డా.మమత మాట్లాడుతు ఆయుష్ విభాగం ద్వారా ఈ శిబిరాలను ప్రజలు అందరు సద్వినియోగం చేసుకోవాలని, అన్ని రకాల వ్యాదులు, బీపీ, షుగర్, కీళ్ళ నొప్పుల, స్త్రీ వ్యాదులు.. మూత్ర సంబంధ వ్యాదులు అన్నిటికీ పరీక్షలు నిర్వహించి ఉచితముగా లు అందరికీ పంపిణీ చేశామని చెప్పారు.. ఆయుర్వేద ఔషదం లతో ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు అని తెలిపారు. ఈ శిబిరంలో డా..వెంకటేశ్, డా. శశి దర్, ఆయుష్ డీపీఎం వందన రెడ్డి, ఆయుష్ విభాగం ఫార్మా శిష్ట్స్ లు పురుషోతం, సుమ లత, రేకారని, ఆయుష్ సిబ్బంది మహేష్.. హెడ్ నర్సు రత్నకుమారి, ఏ ఎన్ ఎం లు, ఆశ కార్య కర్తలు తదితరుల పాల్గోన్నారు.