బతుకమ్మ, బాల్కోండ:
శ్రీరాం సాగర్ ప్రాజెక్ట్ వరధ గేట్లను మూసివేశారు.ఎస్సారెస్పీకి గత కోన్ని రోజులుగా వరధ లక్ష క్యూసెక్కుల నుంచి 3 లక్షల వరకు వచ్చిన విషయం తెలిసిందే. గత నాలుగు రోజులుగా ప్రాజెక్టు 41 గేట్లను ఎత్తి నీటిని గోదావరిలోకి వదిలిన అధికారులు ఇన్ ప్లో తగ్గడం తో గురువారం ఉదయం ప్రాజెక్టు గేట్లను మూసేశారు. ప్రాజెక్టు నీటి మట్టం 1091 అడుగులు కాగా ప్రస్తుతం 1066.50 అడుగులు మాత్రమే ఉండి 80.5 టియంసీలకు 71.470 టియంసీల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టుకు 76,643 క్యూసెక్కుల ఇన్ ప్లో వస్తుండటంతో ప్రాజెక్టు నిండిన తరువాత నీటి విడుధల చేయాలని ప్రాజెక్టు గేట్లను మూసివేశారు. వరధ గేట్లను మూసివేసిన ఇంకా ఇతర అవసరాల కోసం 23,867 క్యూసెక్కుల నీటి విడుధల కోనసాగుతుంది.