కేంద్రం నిధులను మళ్ళించడమే ఆలస్యానికి కారణం
గతంలో ఆర్అండ్ బి మంత్రి ఉన్నా జిల్లాలో పూర్తి కాని వైనం
కేంద్రం నిధులు ఇచ్చినా . . . రాష్ట్ర ప్రభుత్వం నిధుల విడుదలలో జాప్యం
ఎంపీ అరవింద్ చొరవ చూపిన ముందుకు సాగని పనులు
బతుకమ్మ, నిజామాబాద్
కేంద్రం ఇచ్చిన నిధులను గత బిఆర్ఎస్ ప్రభుత్వం దుర్వినియోగం చేయటంతో నిజామాబాద్ జిల్లాలో ఓ రైల్వే ఓవర్ బ్రిడ్జిలు పనులు నిలిచిపోయాయి. దీంతో నిజామాబాద్ నుండీ ఉత్తర తెలంగాణలో పలు జిల్లాలకు వెళ్ళే వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీనిపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రయాణీకుల ప్రాణాలతో చెలగాటం ఆడీన గత బిఆర్ఎస్ ప్రభుత్వ నిర్వాకంపై జనమ మండిపడుతున్నారు. అసలు ఏంటా ఆర్వోబి?ఆ పనులు ఎందుకు నిలిచిపోయాయి? 20 ఏళ్ళ క్రితం నిజామాబాద్ -కరీంనగర్- పెద్దపల్లి రైల్వే నిర్మాణం జరిగింది. ఈ క్రమంలో నిజామాబాద్ జిల్లా మాక్లూర్ మండలం అడవిమామిడిపల్లి గ్రామం వద్ద రైల్వే గేటూ ఏర్పాటు చేసారు. ఈ రైల్వే గేట్ నిజామాబాద్ నుండి ఆర్మూర్,ఆదిలాబాద్,కరీంనగర్,వరంగల్,నాగ్ పూర్ వెళ్ళే మార్గంలో ఉంటుంది. దీంతో గేటు పడ్డ ప్రతి సారి వందలాది వాహనాలు నిలిచిపోతున్నాయి. ఈ సమస్యను అదిగమించేందుకు కేంద్ర ప్రభుత్వం 2015లో ఆర్వోబి నిర్మాణానికి అమోదం తెలిపింది. రూ.12 కోట్లను జాతీయ రహదారుల సంస్థ ఖాతాలో కేంద్ర ప్రభుత్వం జమ చేసింది. టెండర్లు పూర్తి చేసి కాంట్రాక్టర్ పనులు కూడా ప్రారంభించారు. అయితే రూ.12 కోట్ల నిధులను అప్పటి కేసిఆర్ నేత్రుత్వంలోని రాష్ట్ర ప్రభుత్వం జాతీయ రహదారుల సంస్థ మీద ఒత్తిడి తెచ్చి రాష్ట్ర ఖజానాను బదిలీ చేయించుకుంది. ఇదంతా గుట్టుచప్పుడు కాకుండా దొంగచాటున జరిపింది అప్పటి బిఆర్ఎస్ ప్రభుత్వం. దీంతో బిల్లులు రాక కాంట్రాక్టర్ పనుల్ను మద్యలోనే నిలిపివేశాడు. ఎంపి అర్వింద్ గత 5 యేళ్ళూగా గత బిఆర్ఎస్ ప్రభుత్వం చేసిన నిర్వాకాన్ని పదే పదే ప్రస్తావించాడు. పలుమార్లు అప్పటి ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసాడు. కానీ అప్పటి ప్రభుత్వం స్పందించలేదు. అప్పట్లో జిల్లాకు చెందిన ప్రశాంత్ రెడ్డి ఆర్ అండ్ బి మంత్రిగా పని చేసారు. మామిడిపల్లి ఆర్వోబి కోసం కేంద్రం ఇచ్చిన నిధులను ఆయన తన నియోజక వర్గానికి ఖర్చు పెట్టాడాన్న ఆరోపనలున్నాయి. అయితే మామిడిపల్లి ఆర్వోబి నిర్మాణంపై సీరియస్ గా ఉన్న ఎంపి అర్వింద్ కొత్తగా ఏర్పడ్డ రేవంత్ సర్కార్ తో మాట్లాడారు. తరుచూ మంత్రి కోమటిరెడ్డిని కలిసి సమస్యను వివరించాడు. దీంతో ఇటీవల కాంగ్రేస్ ప్రభుత్వం 1.50 కోట్ల రూపాయలను సదరు కాంట్రాక్టరుకు విడుదల చేసింది. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాల చొరవతో మళ్ళీ అడవిమామిడిపల్లి ఆర్వోబి పనులు ప్రారంభమయ్యాయి. ఇక గత 9 ఏళ్లుగా మామిడిపల్లి గ్రామం వద్ద పనులు నత్తనడకన సాగటంతో ఆ గ్రామ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అడవి మామిడిపల్లిమీదుగా నిత్యం వేలాది వాహనాలు తిరుగుతాయి. నిజామాబాద్- కరింనగర్నిజామాబాద్- ఆదిలాబాద్ మీదుగా నిత్యం వేలాడి వాహనాలు ఈ జాతీయ రహదారి63 గుండా వెళ్తాయి. మామిడిపల్లి వద్ద రైల్వే గేటూ పడ్డ సమయంలో వందల వాహనాలు ఇరువైపుల నిలిచిపోతాయి. గత 9 సంవత్సరాలుగా పనులు సాగుతుండటంతో ఉన్న తాత్కాలిక రోడ్డూ పూర్తిగా చెడిపోయింది. వందల గుంతలు ఏర్పడ్డాయి. ద్విచక్ర వాహనాదులు జంపింగ్ జపాంగ్ అంటూ వెళ్ళాల్సిందే. దీంతో ఒళ్లునొప్పులు, ముఖ్యంగా నడుము నొప్పి సమస్యలు వస్తున్నాయంటూన్నారు. రోడ్డూ కారణంగా తమ ఆటోల్లో జనం ఎక్కాట్లేదంటున్నారు ఆటోవాలాలు. ఇక కార్లు చెడిపోతున్నాయని వాపోతున్నారు జనం. 2015లో ఆర్వోబి నిర్మాణం కోసం కేంద్రం ఇచ్చిన రూ.12 కోట్లను గత బిఆర్ఎస్ ప్రభుత్వం ఇతర అవసరాలకు వాడిందని తద్వారా ఆర్వోబి పనులు నిలిచిపోయాయని బిజేపి,కాంగ్రేస్ నేతలు అంటున్నారు. అయితే ఎంపి అర్వింద్ గత 5 సంవత్సరాలుగా దీనిపై పోరాటం చేయటంతో పాటు తరుచూ సమీక్షలు నిర్వహించారు. దీంతో అధికారుల్లో చలనం వచ్చింది. గత ఎన్నికల్లో కాంగ్రేస్ అధికారంలోకి రావటంతో ఎంపి అర్వింద్ తరుచూ రాష్ట్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపారు. గత ప్రభుత్వం ఆర్వోబి నిధులు వాడుకుందని,వాటీని తిరిగి ఆర్వోబికి ఇవ్వాలని కోరారు. దిశా సమావేశం వేదికగా ప్రభుత్వాన్ని కోరారు అర్వింద్. ఈ క్రమంలో మంత్రి కోమటిరెడ్డీ దీనిపై స్పందించారు. తక్షణ అవసరాల కోసం రూ. 1.50 కోట్లు విడుదల చేసారు. ఆర్వోబి పనులు దాదాపు 75 శాతం పనులు పూర్తయ్యాయి. ఇప్పటీకే కాంట్రాక్టరు దాదాపు రూ.6.5 కోటల వరకు ఖర్చ్ఘు చేసారు. అయితే తాజాగా విడుదల అయిన నిధులతో తిరిగి పనులు పునఃప్రారంభమయ్యాయి. ఒక వైపు అప్రోచ్ రోడ్డు పూర్తి చేసి దసరా నాటీకి అందిస్తామని,మిగితా పనులు బిల్లులు విడుదల అయిన కొద్ది పనులు పూర్తి చేస్తామని కాంట్రాక్టరు తెలిపారు. అయితే ఎంపి అర్వింద్ క్రుషితో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో మామిడిపల్లి ఆర్వోబి పనులు తిరిగి ప్రారంభం కావటంతో సమీప గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే గత కేసిఆర్ సర్కార్ చేసిన తప్పిదంపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిఆర్ఎస్ ప్రభుత్వం వల్ల ఆగిన పనులు ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వ సాకారంతో కొనగుతున్నాయి. కేంద్రరాష్ట్ర ప్రభుత్వాల సమన్వయంతో చొరవతో పనులు మళ్ళీ మొదలయ్యాయి.