బతుకమ్మ,మోర్తాడ్ : అంకితభావంతో పనిచేస్తూ ప్రజల సమస్యలను పరిష్కరిస్తూ ఎప్పటికప్పుడు ప్రజలకు చేరువలో ఉండి అందరి మన్ననలు పొంది జిల్లా ఉత్తమ ఎమ్మార్వోగా సత్యనారాయణ, ఎంపీడీవోగా తిరుమల దేవి ఎంపిక కావడంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు వారిని పూలమాలలు వేసి శాలువాలతో సన్మానించారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షులు ముత్యాల రాములు, గ్రామ పార్టీ కాంగ్రెస్ అధ్యక్షులు పుప్పాల అశోక్, మైపాల్, బ్రహ్మయ్య, కుంట శీను, సుంకేట్ రాజేష్, దేవేందర్, అనిల్ రెడ్డి, నవీన్ తదితరులు పాల్గొన్నారు.
