జర్నలిస్టుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట: ఎపిఎంఎఫ్ జిల్లా మహాసభలో అమలాపురం ఎమ్మెల్యే ఆనందరావు

2,307

అమలాపురం, అక్టోబర్ 27(తెలుగురాష్ట్రం ప్రతినిధి): జర్నలిస్టుల సంక్షేమానికి కూటమి ప్రభుత్వం పెద్దపీట వేస్తోందని అమలాపురం ఎమ్మెల్యే అయితాబత్తుల ఆనందరావు చెప్పారు. ఆంధ్రప్రదేశ్ మీడియా ఫెడరేషన్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ప్రథమ మహాసభ ఆదివారం నాడు అమలాపురం కిమ్స్ మెడికల్ కళాశాల కాన్ఫరెన్స్ హాలులో జరిగింది. ఈ మహాసభకు ముఖ్యఅతిథిగా ఎమ్మెల్యే ఆనందరావు హాజరై మాట్లాడారు. గతంలో టిడిపి ప్రభుత్వం అధికారంలో ఉన్నపుడే దివంగత మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మెట్ల సత్యనారాయణరావు అమలాపురంలో ప్రెస్ క్లబ్ భవనానికి స్థలం ఇచ్చారని, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇచ్చారని ఆయన గుర్తు చేశారు.

ఏపిఎంఎఫ్ జిల్లా మహాసభకు విచ్చేసిన ఎంఎల్ఏ ఆనందరావుకు స్వాగతం పలుకుతున్న టీడిపి వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బోళ్ల వెంకట రమణ.

పని చేసే ప్రతి జర్నలిస్టుకు అక్రిడేషన్ ఇప్పించేందుకు కృషి చేస్తానని చెప్పారు. గతంలో ఇళ్ళ స్థలాలు పొందని జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు ఇస్తామని చెప్పారు. కనీస వేతనం, ఉద్యోగ భద్రత లేకుండా పని చేస్తున్న జర్నలిస్టులకు వైద్యపరమైన అవసరాలు, ఇతర రాయితీల కోసం ప్రభుత్వంతో సంప్రదిస్తామని చెప్పారు. జర్నలిస్టులు వృత్తి నిర్వహణలో నిష్పక్షపాతంగా వ్యవహరించాలని, నిబద్ధతతో వృత్తిని నిర్వహించాలని కోరారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో ప్రసాదించిన హక్కులను సద్వినియోగం చేసుకుని సమాజ అభ్యున్నతికి పాటు పడాలని కోరారు. తగిన ఆధారాలతో, నిజాయితీతో వార్తలు అందించే జర్నలిస్టులు ఎల్లప్పుడూ ధైర్యంగా ముందడుగు వేయవచ్చునని ఆనందరావు చెప్పారు. జర్నలిజంలోకి ఒక పార్టీ పత్రిక ప్రవేశించిన తరువాత మీడియా విలువలు దెబ్బతిన్నాయని, ప్రత్యర్ధులతో బురద జల్లడమే ఆ మీడియా పనిగా పెట్టుకుందని ఆయన విమర్శించారు. 

ఏపిఎంఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఢిల్లిబాబు రెడ్డితో జిల్లా నూతన కార్యవర్గం.

శాసనమండలి సభ్యులు బొమ్మి ఇజ్రాయిల్ మాట్లాడుతూ వచ్చే శీతాకాల సమావేశాలలో జర్నలిస్టుల సమస్యలను మండలి దృష్టికి తీసుకు వస్తానని చెప్పారు. జర్నలిస్టుల సంక్షేమానికి రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని ఆయన అన్నారు. శాసనమండలి మాజీ ఛైర్మన్, టిడిపి పొలిట్ బ్యూరో సభ్యులు రెడ్డి సుబ్రహ్మణ్యం మాట్లాడుతూ జర్నలిస్టుల రక్షణ కోసం ఒక ప్రత్యేక చట్టం అవసరమని అన్నారు. ఎపిఎంఎఫ్ ఈ అంశాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల దృష్టికి తీసుకు వెళ్లాలని, టిడిపి పొలిట్ బ్యూరోలో ఈ అంశాన్ని ప్రస్తావించి చట్ట సాధనకు కృషి చేస్తానని చెప్పారు. అసమానతలు లేని సమాజ నిర్మాణానికి జర్నలిస్టుల సహకారం ఎంతైనా అవసరమని ఆయన అన్నారు.

ఐజెయూ జాతీయ ఉపాధ్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాస్ తో జిల్లా ఏపిఎంఎఫ్ సారధులు.

మహాసభకు అధ్యక్షత వహించిన ఎపిఎంఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. ఢిల్లీబాబు రెడ్డి మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యల పరిష్కారం కోసం, సంక్షేమం కోసం తాము చేస్తున్న కృషిని వివరించారు. జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు, ఇళ్ల స్థలాలు, ఆరోగ్య బీమా కార్డుల సాధనకు కృషి చేస్తామని చెప్పారు. ఇప్పటికే ఈ దిశగా సమాచార శాఖ మంత్రి పార్ధసారధి, ఐ అండ్ పిఆర్ డైరెక్టర్ హిమాన్షు శుక్లాలతో చర్చించామని చెప్పారు.

జిల్లా బిజెపి అధ్యక్షులు యాళ్ళ దొరబాబు మాట్లాడుతూ కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జర్నలిస్టుల సంక్షేమానికి చర్యలు చేపడుతున్నాయని చెప్పారు. జర్నలిస్టులపై దాడులు చేసే వారిని కఠినంగా శిక్షిస్తామని ఇటీవల ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన ప్రకటనను ఆయన గుర్తు చేశారు. ఇండియన్ జర్నలిస్ట్స్ యూనియన్ జాతీయ ఉపాధ్యక్షులు చెల్లుబోయిన శ్రీనివాస్ మాట్లాడుతూ జర్నలిస్టులకు రాయితీతో రైల్వే ప్రయాణ పాసుల పునరుద్ధరణకు, జాతీయ రహదారులపై టోల్ ఛార్జీల మినహాయింపునకు ఐజెయు చేస్తున్న కృషిని వివరించారు.

ఏపిఎంఎఫ్ జిల్లా అధ్యక్షులు గుబ్బల రాము, ఉపాధ్యక్షులు అయితాబత్తుల రాజశేఖర్, కార్యదర్శి కుంపట్ల బాబీలను అభినందిస్తున్న టీడిపి వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బోళ్ల వెంకట రమణ.

ఈ సభలో అమలాపురం మున్సిపల్ ఛైర్ పర్సన్ రెడ్డి సత్య నాగేంద్ర మణి, టిడిపి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శులు మెట్ల రమణబాబు, పెచ్చెట్టి చంద్రమౌళి, నామన రాంబాబు, బిజెపి జిల్లా ప్రధాన కార్యదర్శి మోకా వెంకట సుబ్బారావు, టిడిపి వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి బోళ్ళ వెంకటరమణ, మాజీ ఎంపిపి బొర్రా ఈశ్వరరావు, జిల్లా తెలుగుయువత అధ్యక్షులు చిలువూరి సతీష్ రాజు, రాజోలు నియోజకవర్గ టిడిపి నాయకులు రుద్రరాజు రామలింగరాజు, జనసేన నాయకులు కంచిపల్లి సత్యనారాయణ (అబ్బులు), సీనియర్ పాత్రికేయులు చొల్లంగి అప్పాజీ, టిడిపి మీడియా కోఆర్డినేటర్ బోళ్ళ సతీష్ బాబు ప్రసంగించారు. అనంతరం ఎపిఎంఎఫ్ నెల్లూరు జిల్లా అధ్యక్షులు మల్లికార్జున్ రిటర్నింగ్ అధికారిగా వ్యవహరించి జిల్లా కమిటీ ఎన్నికలు నిర్వహించారు.

ఎపిఎంఎఫ్ జిల్లా కార్యవర్గం

డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఎపిఎంఎఫ్ అధ్యక్షునిగా గుబ్బల రాము (మహా న్యూస్-రామచంద్రపురం), కార్యదర్శిగా కుంపట్ల బాబి(99 టివి- అమలాపురం), కోశాధికారిగా దొమ్మేటి శ్రీనివాస్ (ఐ న్యూస్- రాజోలు), ఉపాధ్యక్షులుగా అయితాబత్తుల రాజశేఖర్(తెలుగురాష్ట్రం- అమలాపురం), మట్టపర్తి రవీంద్రనాథ్(విశాలాంధ్ర- కాట్రేనికోన), సహాయ కార్యదర్శులుగా చెరుకూరి లక్ష్మణస్వామి నాయుడు (ఆంధ్రజ్యోతి- అల్లవరం), కురుపూడి వెంకట్రావు (360 న్యూస్-మండపేట) ఎన్నికయ్యారు. కార్యవర్గ సభ్యులుగా వై. శ్రీనివాసరావు (హెచ్ఎంటివి- రామచంద్రపురం), మట్టపర్తి హరికృష్ణ (ఆర్ టివి-ముమ్మిడివరం), వి. దుర్గారావు (గోదావరి- ఐ.పోలవరం), భూపతి శ్రీనివాసరావు (బహుజన9 టివి- మామిడికుదురు), దార్ల బాబు (రైతుస్టార్ ఛానల్- రామచంద్రపురం), కెబివి సత్యనారాయణ (విశ్వంవాయిస్- కొత్తపేట), నామాల వెంకటేశ్వరరావు (10 టివి- కొత్తపేట), తాటికాయల నాగ ధనరాజు (వార్త- పి. గన్నవరం), చింతపల్లి రత్నం (పెన్ పవర్- అమలాపురం), ఇళ్ళ శ్రీనాగరాజు (డి5 న్యూస్- రామచంద్రపురం) ఎన్నికయ్యారు.

ఏపిఎంఎఫ్ జిల్లా మహాసభకు హాజరైన ప్రతినిధులు.

ఎలక్ట్రానిక్ మీడియా అసోసియేషన్ కార్యవర్గం

ఎపిఎంఎఫ్ అనుబంధంగా ఉన్న ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షునిగా గుత్తుల శ్రీనివాస్ (వి5 న్యూస్- ఉమ్మడి తూర్పుగోదావరి), ఉపాధ్యక్షులుగా బసవా బలరామ్ (సివిఆర్ న్యూస్- ముమ్మిడివరం), మట్టపర్తి జానకిరామయ్య (మాస్టర్ కీ న్యూస్-కొత్తపేట), కార్యదర్శిగా దంగేటి శ్రీనివాస్ (వై.ఎన్.సి న్యూస్- అమలాపురం), సహాయ కార్యదర్శులుగా తోట జయరామారావు (ఎస్.ఎల్.టి న్యూస్- ముమ్మిడివరం), కనకాల శ్రీనివాసరావు (కెసిసి- రామచంద్రపురం), కోశాధికారిగా ఎన్.కె.ఎన్.ఎస్.పి. ఆచార్యులు (99 టివి- ముమ్మిడివరం), కార్యవర్గ సభ్యులుగా భీమవరపు సూర్యరాజు (డివి9- ముమ్మిడివరం), బొరుసు వెంకటరత్నం (99 టివి- పి. గన్నవరం), ఎస్.కె. చిన్న దుర్గబాబు (బి.ఆర్.కె. న్యూస్- పి.గన్నవరం), గుబ్బల ప్రసాద్ (బి.ఆర్.కె. న్యూస్- రాజోలు), బొమ్మిడి హరిబాబు (విజేత న్యూస్- అమలాపురం), కారుపల్లి శ్రీనివాస్ (విజేత న్యూస్- రాజోలు) ఎన్నికయ్యారు.

చిన్నపత్రికల కార్యవర్గం

ఎపిఎంఎఫ్ అనుబంధమైన స్మాల్ అండ్ మీడియం న్యూస్ పేపర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షునిగా కోన సత్యనారాయణ (గోదావరి- అంబాజీపేట), ఉపాధ్యక్షులుగా ఎన్. నారాయణరావు (గళమ్- అమలాపురం), కార్యదర్శిగా దడాల త్రిమూర్తులు (అఖండ భూమి- అమలాపురం), సహాయ కార్యదర్శిగా జి.ఎన్.వి.ఎస్. నారాయణ (వైజాగ్ ఎక్సప్రెస్- పి. గన్నవరం), కోశాధికారిగా వివి నరసింహారావు (మెట్రో వాయిస్- అమలాపురం) ఎన్నికయ్యారు.

Leave A Reply

Your email address will not be published.